SDT 18 : సాయి ధరమ్ కోసం భూమి వెయిటింగ్… కాన్సెప్ట్ అదిరిపోలే

SDT 18 : దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరం తేజ్ నెక్స్ట్ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డితో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఈ మూవీ అప్డేట్ ఏంటి ? ఏ కాన్సెప్ట్ తో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ ఇండియా మూవీపై అఫిషియల్ అనౌన్స్మెంట్

సాయి ధరమ్ తేజ్ గత ఏడాది విరూపాక్ష సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఆయన చేసిన సినిమా కావడం, కంటెంట్ కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండడంతో ఈ మూవీ యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అదే జోష్ తో తన మామ మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. కానీ ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో సాయి తేజ్ ఆలోచనలో పడ్డాడు.

నిజానికి ఆయన రెమ్యూనరేషన్ పెంచడం, మార్కెట్ అంతగా లేకపోవడం, బడ్జెట్ సమస్యల కారణంగా సాయి తేజ్ నెక్స్ట్ సినిమాలు వాయిదా పడ్డాయి అని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తేజ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత దాన్ని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే తన పాన్ ఇండియా సినిమా పూజా కార్యక్రమాలు చేసుకున్నాడు సాయి తేజ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత నిరంజన్ రెడ్డి. పైగా కాన్సెప్ట్ ఏంటో కూడా ఆ పోస్టర్ ద్వారానే వెల్లడించారు.

- Advertisement -

Image

కాన్సెప్ట్ ఏంటంటే ?

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం చేస్తున్న మూవీ ఆయన కెరీర్లో 18వ సినిమా. అందుకే ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ గా ఎస్డిటి 18 అని పెట్టారు. ఈ మూవీ తో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఓ పోస్టర్ ద్వారా విడుదల చేశారు నిర్మాతలు. పోస్టర్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. పోస్టర్లో ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతంలో ఓ పచ్చని చెట్టు ఉండడం, దాని చుట్టూ ల్యాండ్ మైండ్స్ లాంటివి ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ లో తేజ్ కోసం భూమి ఎదురు చూస్తోందని తెలిపారు. ఇక ఇది ఒక పీరియాడికల్ డ్రామా, ఈ మూవీతో సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను నిర్మించారు. అందులోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కాగా ఎస్డిటి 18 మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు