Kriti Sanon.. టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ కృతి సనన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మొదట మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో సినీ కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత దోచేయ్ తదితర చిత్రాలలో నటించినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన కృతిసనన్ బాలీవుడ్ లో ధోని బయోపిక్ లో నటించి భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో వరుసగా బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కృతి సనన్ స్టార్ స్టేటస్ వెనుక చాలా కష్టాలు అవమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
ఐరన్ లెగ్ అనే విమర్శలు..
కృతి సనన్ ప్రస్తుతం కెరియర్ అయితే స్టార్ రేంజ్ లో దూసుకుపోతున్నప్పటికీ.. గతంలో ఈమె కెరియర్ ఎలా సాగింది అనే విషయం పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు.. బాలీవుడ్ లో మొదట హీరోపంటి” అనే సినిమా చేసింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈమెకు స్టార్ స్టేటస్ ను మాత్రం తీసుకురాలేదు. తెలుగులో నటించిన రెండు చిత్రాలు కూడా ఫ్లాప్ లుగానే మిగిలిపోయాయి. అలా తెలుగు ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే విమర్శను కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ లో కూడా అవమానాలు..
ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టినా.. అక్కడ కూడా సరైన అవకాశాలు లేక కొన్నేళ్లపాటు బ్యాడ్ ఇమేజ్ ని సంపాదించుకుంది. ఎన్నో రకరకాల విమర్శలు , సవాళ్లను సైతం ఎదుర్కొంది కృతి సనన్. ముఖ్యంగా సొంత పరిశ్రమ అయిన బాలీవుడ్ ఈ ముద్దుగుమ్మని చిన్న చూపుగా చూసినట్లు గతంలో వార్తలు కూడా వినిపించాయి. ఇటీవలే కృతి సనన్ తన పదేళ్ల సినీ కెరియర్ ను ఉద్దేశించి ఇవే సంఘటనలను సైతం ఈ ముద్దుగుమ్మ గుర్తుచేసుకుంది. అయితే ఇన్ని అవమానాలను కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం తన పని మాత్రమే అంటూ తెలియజేసింది.
ప్రతిభ వృధా కాలేదు..
తన జీవితంలో సినీ కెరియర్ లో ఎన్నో విమర్శలు.. అవమానాలు ఎదురైనా.. కేవలం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లడం వల్లే ఈరోజు ఇంతటి గొప్ప స్థాయిలో ఉన్నానంటూ తెలియజేసింది. ముఖ్యంగా తాను నమ్మిన కష్టం.. ప్రతిభ వృధా కాలేదు అని అందుకే స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలు కల్పించింది అంటూ తెలియజేసింది. ఎలాంటి పని చేసినా వ్యక్తిగతంగా వృత్తిపరమైన భావనతో చేయడమే ముఖ్యము అంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.
కృతిసనన్ తెలుగు సినిమాలు..
మహేష్ బాబు హీరోగా నటించిన వన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఇటీవల ప్రభాస్ తో కలిసి ఆది పురుష్ సినిమాలో సీత క్యారెక్టర్ లో నటించింది. అయితే ఈ సినిమా ఘోరాతి ఘోరంగా డిజాస్టర్ పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో పాత్రలను చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. అందుకే ఈ సినిమాతో కృతి సనన్ కి ఎటువంటి ఉపయోగం కలగలేదు అని చెప్పవచ్చు.