Varun Tej New Movie : ఫ్లాఫ్ డైరెక్టర్ కు వరుణ్ గ్రీన్ సిగ్నల్… రిస్క్ అవసరమా?

Varun Tej New Movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాల విషయంలో తెగ కష్టపడుతున్నాడు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఇటీవల కాలంలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరుణ్ తేజ్ ఓ ప్లాఫ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫాన్స్ ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా ? అని ఆందోళన పడుతున్నారు. మరి ఇంతకీ వరుణ్ తేజ్ ఏ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే…

డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్

రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆశలన్నీ మట్కా మూవీ పైనే పెట్టుకున్నాడు. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్స్ లో ఉంది. ఆపరేషన్ వాలెంటైన్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న వరుణ్ మళ్లీ మట్కా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించాడు. మట్కా మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాలను కూడా లైన్లో పెడుతున్నారు. అందులో భాగంగా వరుణ్ మరొక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది.

Varun Tej - Wikipedia

- Advertisement -

రిస్క్ అవసరమా ?

దీంతో మెగా ఫ్యాన్స్ మరోసారి వరుణ్ తన డెసిషన్ గురించి ఆలోచించుకుంటే మంచిది అని అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే విక్రమ్ సిరికొండ ఇప్పటిదాకా చేసింది కేవలం ఐదు సినిమాలే. అందులో మొదటి మూడు సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. అయితే టచ్ చేసి చూడు అంటూ రవితేజ మూవీతో డైరెక్టర్ గా మారారు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అలాగే విక్రమ్ సిరికొండ అసోసియేట్ రైటర్ గా పని చేసిన భోళాశంకర్ మూవీ కూడా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పటి దాకా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మరో సినిమా కన్ఫామ్ కాలేదు.

కానీ తాజాగా ఆయనతో మూవీకి వరుణ్ తేజ్ సిద్ధమవడం చర్చకు దారి తీసింది. విక్రమ్ సిరికొండ వరుణ్ కి ఓ లవ్ స్టోరీని వినిపించగా, ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటులు, టెక్నీషియన్ల సెలక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతోంది. 2025 ప్రథమార్థంలో షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయని సమాచారం. కానీ ఇప్పటికే ప్రయోగలతో తన మార్కెట్ ను చేతులారా తగ్గించుకున్న వరుణ్ ఇప్పుడు విక్రమ్ పై నమ్మకం పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు