Renuka Swamy : కన్నడ ఇండస్ట్రీలో రేణుకా స్వామి మర్డర్ కేసు ప్రకంపనాలు సృష్టిస్తుంది.. ఈ కేసు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. కన్నడ హీరో దర్శన్, పవిత్రలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా తేలిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.. రేణుకా స్వామి హత్య కేసు విచారణలో రోజుకో సంచలన విషయం బయటకు వస్తుంది. తాజాగా మరో నటి ఈ కేసు పై స్పందించింది.. రేణుకా స్వామి తనను కూడా వేధించినట్లు ఆరోపించింది.. ఫేక్ అకౌంట్ తో అసభ్యకరమైన మేసేజ్ లు పంపినట్లు ఆమె పేర్కొన్నారు..
రేణుకా స్వామిని కన్నడ హీరో దర్శన్ తో పాటుగా మరో 17 మంది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.. పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.. తాజాగా ఈ కేసు పై కన్నడ బిగ్ బాస్ ఫేమ్ చిత్రాల్ రంగస్వామి స్పందించారు… ఆమె మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. నేను ఎవరిని కాపాడాలని రాలేదు.. కానీ నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రం ఇక్కడ పంచుకుంటున్నానని ఆమె తెలిపారు.. రేణుకా స్వామి ఫేక్ అకౌంట్లతో ఒకరిద్దరికి అసభ్యకరమైన మెసేజ్ లను పంపుతున్నారు.. అలాగే నాకు కూడా పంపారు..
ఆ మెసేజ్ లు చూడగానే నేను వెంటనే బ్లాక్ చేశాను.. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూశాక నాకు అర్థమైంది.. నీకు ( రేణుకా స్వామి) మంచి భార్య ఉన్నా కూడా ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం ఎందుకు.. ఆ భాధ నీ భార్యకు మాత్రమే తెలుస్తుంది.. ఇప్పుడు ఆమె పడే ఆవేదన వర్ణనాతీతం అని చిత్రాల్ పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈమె సినిమాల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిత్రాల్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఈమె కన్నడ బిగ్ బాస్ 10 లో పాల్గొన్న విషయం తెలిసిందే..