Kangana Ranaut.. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన హీరోయిన్ కంగనా రనౌత్.. టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. నిరంతరం బాలీవుడ్లో ఈమె పేరు ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ మండీ నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందింది కంగనా రనౌత్.. ఇదిలా ఉండగా గడిచిన గత కొన్నేళ్ల క్రితం ఈమె నటించిన ఎమర్జెన్సీ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడు రచన దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నోసార్లు వాయిదా పడింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్..
1975 జూన్ 25వ తేదీన అర్ధరాత్రి ఒక ఎమర్జెన్సీ విధించారు.. నేటితో 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50 వ ఏడాదిలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం జరిగింది కంగనా రనౌత్ . ముఖ్యంగా ఇందిరా గాంధీ భారత దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది.. ఎమర్జెన్సీ చీకటి రోజులు అంటూ తాజాగా తను నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రానికి సంబంధించి విడుదల తేదీని కంగనా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ ఆధారంగానే ఈ ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించింది.
ఎమర్జెన్సీ సినిమా డేట్ లాక్…
ఎమర్జెన్సీ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ లో కంగనా రనౌత్ తెలియజేసింది.. అందుకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా షేర్ చేసింది.. వాస్తవానికి జూన్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా..కంగనా పొలిటికల్ ఎంట్రీ పరంగా బిజీగా ఉండడంతో ఈ సినిమా విడుదల విషయంలో కాస్త ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది… ముఖ్యంగా ఈమె బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగి హిమాచల్ లోని మండి నియోజకవర్గంలో నిలబడి గెలిచింది. మణికర్ణిక ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ ఎమర్జెన్సీ చిత్రాన్ని ఈమె నిర్మిస్తున్నది.
ఆస్తులు తాకట్టు పెట్టి.. సినిమా తీశాను..
ఈ సినిమా కోసం కంగనా రనౌత్ తన ఆస్తులు అన్నిటినీ కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకువచ్చానంటూ ఒకానొక సందర్భంలో తెలియజేసింది .. భారీ బడ్జెట్ చిత్రంగా ఈమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించింది. ఈమెతోపాటు జయప్రకాష్ నారాయణ , అనుపమ్ ఖేర్ తదితర సెలబ్రిటీలు సైతం నటిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ డేట్ ని తెలియజేయడంతో అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు. మరి కథ తానే రాసుకొని డైరెక్షన్ తానే చేసి ఇప్పుడు సినిమాని విడుదల చేయబోతోంది.. నిర్మాతగా కూడా ఈమె వ్యవహరించడం గమనార్హం. మరి ఏ మేరకు కంగనా రనౌత్ తన టాలెంట్ ని ఈ సినిమా ద్వారా నిరూపించుకుంటుందో చూడాలి.
View this post on Instagram