Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని నేషనల్ క్రష్ గా నిలిచింది. 2016 సంవత్సరంలో కన్నడ పరిశ్రమలో కిరిక్ పార్టీ సినిమాతో రక్షిత్ శెట్టి సరసన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడమే కాకుండా కన్నడ చిత్రాలలోనే అత్యధిక వసుళ్లు రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కన్నడలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2018లో చలో సినిమాలో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రష్మిక వరుస చిత్రాలలో దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో రష్మిక పాపులర్ అయిపోయింది. ఆ సినిమా అనంతరం సీతారామం వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. 2023 సంవత్సరంలో రష్మిక నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఆ తర్వాత ఈ బ్యూటీకి బాలీవుడ్ లోను వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక సినిమాల్లో నటిస్తోంది. తెలుగు, కన్నడ, హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, విక్కీ కౌశల్ హీరోగా చావా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా….తాజాగా కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి తన స్నేహితులతో కలిసి వెళ్లి అక్కడ సందడి చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన.
కొడగు ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. రష్మిక అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కొన్ని ఫోటోలను దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా…. “కొడగు ఇక్కడ నా చరిత్ర, నా హృదయం ఉన్నాయి. నేను, నా స్నేహితురాళ్లు ఇక్కడే పెరిగాము. భగవంతుడా…..నా సొంత గడ్డను ఎలా మిస్ అవుతున్నాను?” అంటూ రష్మిక ట్వీట్ చేశారు. అక్కడ రష్మిక సాంప్రదాయ దుస్తులను ధరించి ఫోటోలు దిగింది. నేషనల్ క్రష్ రష్మిక మందన పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.