Meera Nandan.. ఈమె పేరు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన ” జై బోలో తెలంగాణ” సినిమా హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. 2011 అంటే దాదాపు 13 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది అని చెప్పవచ్చు.. ఈ మూవీలో సందీప్ సింగ్, స్మృతి ఇరానీ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించగా మీరానందన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ట్రెడిషనల్ లుక్ లో చక్కటి రూపంతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే తాజాగా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
పెళ్ళి పీటలు ఎక్కిన మీరా నందన్..
తాజాగా ఎలాంటి హడావిడి లేకుండా చడి చప్పుడు కాకుండా ఈ హీరోయిన్ గుడిలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయమే వివాహం జరగగా.. ఈ వేడుకోకు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు ఈ వేడుకకు కేవలం కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.. శనివారం అనగా ఈరోజు ఉదయం గురువాయూర్ ఆలయంలో లండన్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్న శ్రీజూ తో ఈమె ఏడడుగులు వేసింది. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. ఇంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు..
మ్యాట్రిమోని పెళ్లి..
ఇకపోతే ఇలా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకోవడంతో అందరూ ప్రేమ వివాహం అనుకున్నారు.. కానీ ఇది పెద్దలు కుదుర్చిన వివాహం.. సెప్టెంబర్ 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మొదటిసారి ప్రముఖ మ్యాట్రిమోనీ ద్వారా కలుసుకున్నారని సమాచారం. ఇక ఇప్పుడు దాదాపు నిశ్చితార్థం జరిగిన 9 నెలల తర్వాత వివాహం చేసుకోవడం గమనార్హం.
మీరా నందన్ కెరియర్..
1990 నవంబర్ 26న కేరళలోని కొచ్చిలో జన్మించిన ఈమె జర్నలిజం పూర్తి చేసి మొదట యాడ్స్ చేసింది.. ఆ తర్వాత స్టార్ సింగర్ రియాల్టీ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది. ఇక 2007లో వచ్చిన ముల్లా అనే సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మీరా నందన్.. ఆ తర్వాత తమిళ్, కన్నడ, తెలుగు భాషలలో పలు సినిమాలలో నటించినది. తెలుగులో జై బోలో తెలంగాణ సినిమా ద్వారా పరిచయమై.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.. ఈ సినిమా భారీ విజయం అందుకుంది.. కానీ ఎందుకో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఇక తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. చివరిగా “ఎన్నలుమ్ ఎంటే ఆలియా” చిత్రంలో నటించగా.. ఇప్పుడు వివాహం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram