Manchu Lakshmi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలో ఒకటైన మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కుటుంబం నుంచి వచ్చిన మంచు లక్ష్మి హీరోయిన్గా ఎదిగే ప్రయత్నాలు చేసింది కానీ ఆమెకు కలిసి రాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఇక్కడ సౌత్ లో అవకాశాలు రావడం లేదని.. అందుకే బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడే ఇల్లు కొనుగోలు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో ఉంటూ సినిమా అవకాశాలు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తోంది అంటూ ఒక వార్త తెరపైకి రాగా.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ముంబైలో ఉండడానికి కారణం..? ఆ ఇల్లు ఎవరిది ..?అనే పూర్తి వివరాలను వెల్లడించింది.
![Manchu Lakshmi: Secretly at Ram Charan's house in Mumbai.](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/07/Untitled-2024-07-01T074210.748.jpeg)
రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా..
ఇకపోతే మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తన తండ్రి మీద పరోక్షంగా ఆరోపణలు చేసింది.. పితృస్వామ్య సమాజంలో నేను కూడా బాధితురాలిని.. మా నాన్నకి నేను నటి కావడం ఇష్టం లేదు.. కానీ నాన్నను ఎదిరించి ముంబైకి మకాం మార్చాను.. నా ఫ్రెండ్స్ రకుల్ ప్రీత్ సింగ్ , రాణా కోరిక మేరకు ముంబైకి వచ్చి సెటిల్ అయ్యాను అంటూ గత ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసింది.. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మరికొన్ని విషయాలను వెల్లడించింది.. ఇకపోతే ముంబై వెళ్లిన మంచు లక్ష్మి ఖరీదైన అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇల్లు తీసుకోకముందు మంచు లక్ష్మి రామ్ చరణ్ ఇంట్లో ఉండేదట.. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచింది కూడా.. అంతేకాదు తాను రాంచరణ్ ఇంట్లో ఉంటున్నట్లు రామ్ చరణ్ తో కూడా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిందట మంచు లక్ష్మి.ఇక అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అందుకే రహస్యంగా వున్నా..
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేను రామ్ చరణ్ ఇంట్లో ముంబైలో ఇల్లు తీసుకోకముందు ఉన్నాను.. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్ తో చెప్పగా.. చెర్రీ కూడా ఎవరికి చెప్పను అని చెప్పాడు.. అయితే నేను ఇలా రాంచరణ్ ఇంట్లో రహస్యంగా ఉండడానికి కారణం.. నేను రామ్ చరణ్ ఇంట్లో ఉన్నానని తెలిస్తే ఎవరు నాకు పని చేసి పెట్టరు. పైగా మీరు రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా మీకు మా అవసరం ఏముంటుంది అంటారు.. అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను.. ఇక రాంచరణ్ కూడా నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని తెలిపాడు. ఇక తనకే తెలియకుండా తన ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నానో అని వెల్లడించింది లక్ష్మి..
142 మంది ఆర్టిస్టులతో వాట్సప్ గ్రూప్..
అంతే కాదు ఈమె మాట్లాడుతూ.. మేము చాలా రోజుల నుండీ… 142 మంది ఆర్టిస్టులతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసాము. అందులో రానా, రామ్ చరణ్ లాంటి అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు.. ఆ గ్రూప్లో తమ తమ చిత్రాల టీజర్లు, ట్రైలర్లు పోస్ట్ చేస్తారు.. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు వాటిని తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తారు.. ఆ గ్రూప్ అందుకోసమే క్రియేట్ చేసాము అంటూ తెలిపింది మంచు లక్ష్మి మరిక్కడ అవకాశాలు రాలేదని బాలీవుడ్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ ఎలా తన కెరీర్ ను మలుపు తిప్పుకుంటుందో చూడాలి.
Lakshmi Manchu:-
నాకు అపార్ట్మెంట్ లేనప్పుడు చరణ్ ఇంట్లో ఉండేదాన్ని అలా చాలా రోజులు ఉన్నాను…❤️🙏ఆ వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్పే వ్యక్తికి ఒక ఎడిట్ చేసి ఈ వీడియోలన్ని ఒక షో వెయ్యాలి…చూడు వ్యక్తిత్వం లేని కుక్క 🤙pic.twitter.com/v6Jem69IfC
— EshwaRC15 Raj(Dhfc)🔥🔥 (@EshwarDhfc) June 30, 2024