Khaidi 2 Update : తమిళ హీరో కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఖైదీ మూవీ. దీనికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం కార్తీ చేస్తున్న మూవీ పూర్తవ్వగానే నెక్స్ట్ ఖైదీ 2ని స్టార్ట్ చేస్తాడు అనుకుంటే ఆయన దృష్టి మరో సినిమాపై పడింది. దీంతో ఖైదీ 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని సమాచారం.
కార్తీ నెక్స్ట్ మూవీ ఖైదీ 2 కాదు
కార్తీ విభిన్న దర్శకులతో విభిన్నమైన చిత్రాలను చేస్తూ సినీ కెరీర్లో తన బహుముఖ ప్రజ్ఞను చూపిస్తున్నాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖైదీ సీక్వెల్ కోసం మళ్లీ లోకేష్ కనగరాజ్తో కార్తీ పని చేయడానికి రెడీ అవుతున్నాడని గత కొంతకాలంగా వార్తలు విన్పిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా టైమ్ పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే కార్తీ ఇప్పుడు లోకేష్ తో కాకుండా కొత్త దర్శకుడితో కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నాడు. సమాచారం ప్రకారం కార్తీ నెక్స్ట్ దర్శకుడు వెట్రిమారన్కి అసిస్టెంట్గా పని చేసిన తానక్కరన్ దర్శకుడు తమిళ్తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే తన ప్రస్తుత ప్రాజెక్ట్ సర్దార్ 2ను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది.
ఖైదీ కంటే ముందే కొత్త దర్శకుడితో..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ చేయాల్సి ఉన్న ‘ఖైదీ 2’ కంటే ముందు దర్శకుడు తమిళ్తో నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నాడు. కార్తీ, డైరెక్టర్ తమిళ్ కాంబినేషన్ లో రానున్న సినిమా షూటింగ్ 2024 అక్టోబర్లో ప్రారంభం కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్టు సమాచారం. ఆ తరువాత లోకేష్ కనగరాజ్తో ఇదే నిర్మాణ సంస్థ కార్తీ హీరోగా ఖైదీ సీక్వెల్ ప్లాన్ చేసింది.
ప్రస్తుతానికి కార్తీ ఇండియా, అజర్బైజాన్, కజకిస్తాన్లలో చిత్రీకరిస్తున్న సర్దార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ 40% అంతర్జాతీయ లొకేషన్లలో జరగనుంది. ఇప్పటి వరకు కార్తీ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమా ఇదే. ఈ చిత్రం షూటింగ్ జూలై నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2025 నాటికి బిగ్ స్క్రీన్ పైకి సర్దార్ 2 వచ్చే ఛాన్స్ ఉంది.
కార్తీ సాలిడ్ లైనప్
కాగా కార్తీ చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన మీయాళగన్ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ ఈ యాక్షన్ డ్రామాను నిర్మిస్తుండగా, అరవింద్ స్వామి కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ప్రధాన నటీనటులతో పాటు ఈ చిత్రంలో శ్రీ దివ్య, రాజ్కిరణ్, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ వా వాతియార్ చిత్రంలో కూడా కార్తీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కృతి శెట్టి కథానాయికగా కన్పించనున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ఆనందరాజ్, రాజ్కిరణ్, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.