Varalaxmi Sarathkumar: పెళ్లికి ముందే ఆ పని చేసిన లేడీ విలన్‌ ?

Vara Laxmi: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తమిళ నటి అయినప్పటికీ తెలుగులో కూడా అద్భుతంగా నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ నటీనటులు శరత్ కుమార్, రాధికల కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ హీరోయిన్గా మాత్రం ప్రేక్షకులు ఆవిడను ఆదరించలేకపోయారు. దీంతో ఎక్కువగా ఈ బ్యూటీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించి గుర్తింపు తెచ్చుకుంది. కానీ నెగటివ్ పాత్రల్లో నటించడంతో విమర్శలు కూడా చుట్టుముత్తాయి. కానీ వాటిని ఏవి పట్టించుకోకుండా ఆమె తన నటనతోనే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సమాధానం చెప్పింది.

హీరోలకి, హీరోయిన్లకు టఫ్ ఫైట్ ఇస్తూ తన అద్భుతమైన పర్ఫామెన్స్ లతో తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తన బరువుని చాలావరకు తగ్గించుకుని స్లిమ్ గా, అందంగా మారి ఎన్నో సినిమాల్లో అవకాశాలను తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ని ఘనంగా జరుపుకుంది. ఇక తన భర్త నికోలయ్ సచ్ దేవ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.

దాదాపు వీరిద్దరూ ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. కానీ వారి ప్రేమను చాలా రహస్యంగా ఉంచారు. ఇక ఈ మధ్యకాలంలోనే వీరిద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది వరలక్ష్మి. అయితే జూలై 2వ తేదీన థాయిలాండ్ లో వీరి వివాహం గ్రాండ్గా జరగబోతుంది. ఇక వీరి వివాహానికి సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సహా తన పెళ్లి పత్రికలను పంచుతూ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే వివాహ అనంతరం సెలబ్రిటీలందరూ హనీమూన్ కి కొద్దిరోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

- Advertisement -

అయితే వరలక్ష్మి శరత్ కుమార్ వివాహానికి ముందే తన హనీమూన్ ప్లాన్ చేసిందట. ఇటలీలో ఓ పెద్ద హోటల్లో ఈ జంట వారి హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారట. అయితే వీటికి సంబంధించిన టికెట్లు, హోటల్ రూమ్ కూడా బుక్ చేసుకున్నారట. ఈ విషయం తెలిసే చాలామంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. వివాహ అనంతరం అలాంటి ప్లాన్లు చేసుకోవచ్చు కదా… ఇంత తొందరగా అంత పాడు పని అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు