Bigg Boss Season 8 : బుల్లితెర పై టాప్ రియాలిటీ బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే.. గతంలో ఎన్ని షోలు వచ్చినా ఈ షోకు వచ్చినంత పాపులరిటీ మరే షోకు రాలేదని చెప్పాలి.. ఈ షో ఏడాదికి ఒకసారి మాత్రమే మొదలవుతుంది.. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లో షో నడుస్తుంది.. అయితే తెలుగు ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకుంది.. ఎనిమిదో సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.. అయితే గత సీజన్ లో కామన్ మ్యాన్ విన్నర్ గా నిలిచాడు.. ఈ సీజన్ లో ఎలాంటి వాళ్లను షో నిర్వాహకులు తీసుకొస్తారో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పాల్గొన బోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ, రాజకీయ ప్రముఖులకు జాతకాలు చెబుతూ బాగా పాపులారిటీని చేసుకున్నాడు.. అంతేకాదు కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారాడు… ఇటీవల ఏపీ ఎన్నికల పై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు అయ్యింది.. దాంతో రాజకీయాల్లోకి రానని చెప్పాడు.. ప్రస్తుతం హీరోయిన్లకు జాతకాలు చెబుతూ,పూజలు చేయిస్తూ బిజీగా ఉన్నాడు.. అలాంటి వేణుస్వామి బిగ్ బాస్ లోకి వస్తున్నారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..
అలాగే ఈయన రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది.. రోజుకు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాడని టాక్.. వేణుస్వామి వస్తే టీవీలో టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే పెరుగుతుందని భావిస్తుంది.. ఈ వార్త నిజమైతే మాత్రం బిగ్ బాస్ లో జాతకాలు వినాలేమో అంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఇక ఇప్పటికే బర్రెలక్క, కుమారి ఆంటీ, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి… మరి ఎవరు ఈ సీజన్ రాబోతున్నారు అనేది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది..