Varalakshmi.. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కోలీవుడ్లో మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈమె సక్సెస్ పొందలేక.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి టాలీవుడ్ లో విలన్ గా అవతారం ఎత్తి.. పలు సినిమాలలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీగా విలన్ అవతారంలో మరింత క్రేజ్ దక్కించుకున్న రమ్యకృష్ణతర్వాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆల్రెడీ వివాహం జరిగిన వ్యక్తి నికోలయ్ సచ్ దేవ్ తో కొన్ని సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.
హల్దీ , మెహందీ వేడుకల్లో రాధిక , శరత్ కుమార్ డాన్స్ పెర్ఫార్మెన్స్..
ఈ క్రమంలోనే గత మూడు రోజుల క్రితం మొదలైన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మెహందీ వేడుకలు జరగగా.. హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ గా మారాయి. హెల్దీ, మెహందీ వేడుకలలో భాగంగా రాధిక శరత్ కుమార్.. ఆమె భర్త ప్రముఖ హీరో శరత్ కుమార్ కూడా పలు పాటలకు మాస్ స్టెప్ తో ఇరగదీశారు.
థాయిలాండ్ లో పెళ్లి.. చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్..
ఇక ఈరోజు చాలా ఘనంగా రిసెప్షన్ జరిగినట్లు తెలుస్తోంది ఈ రిసెప్షన్ కి పలువురు టాలీవుడ్ హీరోలతో పాటు కోలీవుడ్ హీరోలు హీరోయిన్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.ఇకపోతే ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. థాయిలాండ్ వేదికగా జూలై రెండవ తేదీన వీరి వివాహం జరగగా.. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.. ఇందులో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రిసెప్షన్ కి హాజరైన సెలబ్రిటీస్..
ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్ దేవ్ ల రిసెప్షన్ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ , శోభన, మంచు లక్ష్మి , సందీప్ కిషన్ హాజరు కాగా.. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీ కాంత్, కుష్బూ, సి.సుందర్, సిద్ధార్థ్, జీవా, సుహాసిని మణిరత్నం ప్రభుదేవా, రమ్యకృష్ణ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నికోలయ్ సచ్ దేవ్ కెరియర్..
వరలక్ష్మి శరత్ కుమార్ భర్త నికోలయ్ సచ్ దేవ్ విషయానికి వస్తే .. ఈయన ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటారు.. ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులు విక్రయిస్తూ ఉంటారు.. దాదాపు 14 సంవత్సరాలుగా వీరి ప్రేమాయణం కొనసాగింది.. ఇక ఎట్టకేలకు ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయింది ఈ జంట మొత్తానికైతే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతోందని చెప్పవచ్చు..
View this post on Instagram