Jabardast Rohini.. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలకు వెళుతూ.. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఇటీవలే నటి హేమ కూడా రేవ్ పార్టీలో పాల్గొనడంతో మరొకసారి తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈమెతో పాటు కొంతమంది తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నారని వార్తలు కూడా వినిపించడంతో అందరూ ఆశ్చర్య పోయారు. అంతేకాకుండా నటి హేమను అరెస్టు చేయడమే కాకుండా కొన్ని రోజులపాటు జైల్లో కూడా ఉంచడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ బెయిల్ మీద వచ్చింది హేమ. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో జబర్దస్త్ రోహిణి రేవు పార్టీలో పట్టుబడినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.
రేవ్ పార్టీలో బుక్ అయిన రోహిణి..
గతంలో సీరియల్ యాక్టర్ గా నటించిన రోహిణి.. జబర్దస్త్ లో గెస్ట్ గా వచ్చి ఆ తర్వాత కమెడియన్ గా మారిపోయి.. పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది రోహిణి.. దీంతో ప్రస్తుతం ఈమె పేరు జబర్దస్త్ రోహిణిగా మారిపోయింది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీ లాగే ఉన్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అయితే ఈ వీడియో చూస్తూ ఉంటే అది నిజమైన రేవు పార్టీ వీడియోలా కనిపించడం లేదట.
ప్రమోషన్స్ కోసమేనా..
కేవలం ఏదో సినిమా ప్రమోషన్స్ కి ఉపయోగించిన వీడియో లాగా కనిపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలా సినిమాలకు జబర్దస్త్ రోహిణి ప్రమోషన్స్ చేసింది.. ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. మీడియా ప్రతినిధుల మైకు మీద అసలు ఎలాంటి సింబల్స్ కూడా కనిపించడం లేదని.. ఇది బర్తడే బై ప్రమోషన్ అన్నట్లుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే రోహిణి ఇందులో మాట్లాడుతూ.. తనకేమి సంబంధం లేదని.. బర్త్డే పార్టీ ఉందని చెబితే వచ్చాను అంటూ చెబుతూ వుండగానే.. అదే సమయంలోనే ఒక వ్యక్తి నీకు పాజిటివ్ వచ్చింది అంట కదా అంటూ మీడియా ప్రతినిధి అడిగినట్లుగా చూపించారు.
రేవంత్ రెడ్డి ఆర్డర్ మేరకే ఇదంతా..
అందుకు రోహిణి ఆమె అసలు నాకు టెస్ట్లే చేయలేదు.. ఎలా పాజిటివ్ వస్తుంది అని చెప్పడం జరిగింది.. ఈ ఎన్నారైలు బర్తడే పార్టీ అని పిలిచి వెనక ముందు ఆలోచించకుండా వస్తూ ఉంటారంటూ ఏడుస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. మరి ఈ వీడియో కేవలం ప్రమోషన్స్ వీడియో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన అధికారికంగా ఎలాంటి విషయాన్ని రివీల్ చేయలేదు. ఇదిలా ఉండగా మరొకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచాలి అంటే డ్రగ్స్ పై అవగాహన కల్పించేలా సెలబ్రిటీలు కనీసం రెండు నిమిషాలు మాట్లాడాలని.. సూచించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు ఇలా కుల మాట్లాడి ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి మరి రోహిణి ఈ కోణంలోని వీడియో చేసిందా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
View this post on Instagram