Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె గతంలో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. అంతేకాదు స్టార్ హీరోలతో జత కట్టింది.. గత రెండేళ్లుగా సామ్ అకౌంట్ లో సరైన హిట్ సినిమా పడలేదు.. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.. అక్కడ సినిమాల్లో బిజీ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ ఎప్పుడూ తన గురించి ఏదొక పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. ఆ పోస్ట్ పై డాక్టర్లు మండిపడుతున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు ఇంట్లోనే హైడ్రోజన్ పెరాక్సయిడ్ ను పీల్చితే సరిపోతుందని సమంత ఒక పోస్ట్ ద్వారా తెలిపింది.. ఆ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో ప్రముఖ డాక్టర్స్ స్పందించారు. అలా ఇంట్లోనే పెట్టుకుంటే మాత్రం చనిపోయే అవకాశాలు ఉన్నట్లు వాళ్ళు చెబుతున్నారు. ఒక పెద్ద స్టార్ అయ్యిండి ఇలా తప్పుడు సలహాలు ఇవ్వడం కరెక్ట్ కాదని ఏకీపారేస్తున్నారు. అంతేకాదు ఈ పోస్ట్ పై హీరో , డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. సమంతకు మీరు చెప్తే వింటుందేమో చెప్పండి అంటూ డాక్టర్స్ కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనిపై స్పందించిన నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు. రాహుల్ రవీంద్రన్ సామ్ కు మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే.. మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత ఏడాది సినిమాలకు దూరం అయ్యింది.. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన సినిమాలు చేసిన పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తుంది. అక్కడే వెబ్ సిరీస్ లు చేస్తూ , సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..
Dear Doctor, it would have been really nice if you had invited the Doctor she had tagged in her same post to a debate and engaged with him. We would have all learned a lot from it. Would have helped us make up our minds about this alternate therapy. She is science illiterate like… https://t.co/UpUYnL7VlJ
— Rahul Ravindran (@23_rahulr) July 5, 2024