Kumari Aunty : ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు కుమారీ ఆంటీ.. ఈమె చెప్పిన ఒక్క డైలాగుతో ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయ్యింది.. ఈమె మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది.. యూట్యూబ్ వల్ల బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియా సెలెబ్రేటీ అయిపొయింది.. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. ఈమె క్రేజ్ ను సెలెబ్రేటీలు సైతం వాడేస్తున్నారు.. ఆమె ప్రత్యేకంగా కలిసి సాయం చేస్తామని మాట ఇస్తున్నారు.. తాజాగా బాలీవుడ్ బడా హీరో సోనూసూద్ కూడా ఆమెను కలిసాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
సోషల్ మీడియాలో కుమారీ ఆంటీ కి ప్రత్యేక ఫ్యాన్ మెడ్ పేజ్ ఉండటం మామూలు విషయం కాదు.. రోజు రోజుకు సెలెబ్రేటీలను మించి ఫాలోయివర్స్ పెరిగిపోతున్నారు.. అయితే ఈమె ఫుడ్ కోసం వేరే రాష్ట్రాల నుంచి సినీస్టార్స్ వస్తున్నారు అంటే చిన్న విషయం కాదు.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరో సోనూ సూద్ ఆంటీని కలిసినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. ఆయన ఆమె ఫుడ్ స్టాల్ కు వెళ్లి భోజనం చేశారు.. అనంతరం ఆమెకు శాలువ వేసి సన్మానించారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం అని సోనూసూద్ అన్నాడు. ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలని ఇబ్బందుల్లో కూడా సరైన దారి ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోకపోవచ్చు అని నిరూపించిందని అన్నారు. తాను వెజిటేరియన్ తింటానని ప్లేట్ ఎంత అని అడిగితే కుమార్ ఏంటి 80 రూపాయలు అని చెప్పింది.. ఆ తర్వాత కాసేపు ముచ్చటించిన ఆయన ఏదైన సాయం కావాలంటే అడగమని మాట ఇచ్చాడు.. మొత్తానికి ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది..