Pandit Jganath : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరికి తెలుసు.. ఈ అమ్మడు రీసెంట్ గా ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఈసినిమా వచ్చి వారం అయిన కూడా అదే టాక్ తో కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మరోవైపు వైవాహిక జీవితాన్ని గడుపుతుంది. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే త్వరలోనే పండంటి బిడ్డకు జననం ఇవ్వనున్న దీపిక గురించి ఓ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..
దీపికా పాడుకొనే గత ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ ఏడాది ఫైటర్, కల్కి తో మరో హిట్ సినిమా తన అకౌంట్ లో పడింది.. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే వసూల్ చేసాయి.. అయితే ప్రస్తుతం ఈమె ప్రగ్నెంట్ గా ఉంది. అందుకే సినిమాలను కాస్త తగ్గించింది.. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆమె బిడ్డ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
తాజాగా దీపికా పదుకొనె బిడ్డ పై ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. దీపికా, రణ్ వీర్ జాతకం ప్రకారం.. వారికి మగబిడ్డ పుడుతాడు. వారి జీవితానికి యువరాజు అవుతాడు. యువరాజుల ఉండే అబ్బాయి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు అని అన్నారు.. దీపికా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఈమె సెప్టెంబర్ 2024 లో ప్రసవిస్తారని వ్యక్తిగత వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన ఆరోగాన్ని, కడుపులో ఉండే బిడ్డ ఆర్యొగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొంటున్నారు.. మరి స్వామిజి చెప్పినట్లు మగబిడ్డ పుడతాడా ? లేక ఆడబిడ్డ పుడుతుందా ? అనేది చూడాలి..