Brahmanandam – Shivaji Raja: ఇద్దరి మధ్య గొడవకు కారణమిదేనా…?

Brahmanandam – Shivaji Raja.. టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో బ్రహ్మానందం ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎంతోమంది కమెడియన్లు తెలుగు పరిశ్రమకి వస్తూ ఉన్నప్పటికీ.. బ్రహ్మానందం కి వున్న క్రేజ్ వేరనే చెప్పాలి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలరు కూడా. ఎలాంటి పాత్రలోనైనా సరే ఇమిడిపోయి మరీ నటిస్తూ ఉంటారు బ్రహ్మానందం. అందుకే అభిమానులు ఈయనకు ఆ హాస్యబ్రహ్మ అనే బిరుదును కట్టబెట్టారు. మరోవైపు.. టాలీవుడ్ లో కమెడియన్ గా, స్నేహితుడిగా, విలన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు శివాజీ రాజా.. అయితే ఒకానొక సమయంలో అటు బ్రహ్మానందం ఇటు శివాజీ రాజా మధ్య గొడవ జరిగిందట. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Brahmanandam - Shivaji Raja: The reason for the fight between the two..?
Brahmanandam – Shivaji Raja: The reason for the fight between the two..?

బ్రహ్మానందంతో గొడవపడ్డ శివాజీ రాజా..

గతంలో ఎన్నో చిత్రాలలో కనిపించిన శివాజీ రాజా ఈమధ్య కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చారని చెప్పవచ్చు. గతంలో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా శివాజీ రాజా పనిచేశారు.. ఆ సమయంలో ఎన్నో వివాదాలలో కూడా చిక్కుకోవడం జరిగింది.. ఎలాంటి వివాదాలలో తలదూర్చని శివాజీ రాజా.. ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎలాంటి వారినైనా సరే ఢీ కొట్టడానికి సిద్ధంగానే ఉంటారు. ఇలాంటి సందర్భంలోనే ఒకసారి కమెడియన్ బ్రహ్మానందంతో కూడా గొడవ పడ్డారట. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో శివాజీ రాజానే తెలియజేశారు.

గొడవ అందుకే..

గతంలో జరిగిన ఒక విషయాన్ని శివాజీ రాజా మాట్లాడుతూ.. టాలీవుడ్ లో ఉండే కొంతమంది కమెడియన్లతో కలిసి ఒక చారిటబుల్ ట్రస్టుని కూడా ఏర్పాటు చేశాము.. అయితే ఈ ట్రస్టులో చాలా అవకతవకలు జరిగాయి.. ఈ విషయం తన దాకా రావడంతో తాను ఆపుకోలేక.. ఈ విషయం పైన నటుడు బ్రహ్మానందాన్ని సైతం నిలదీశాను.. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చాలా ఫైర్ అయ్యాను అని తెలిపారు. అయితే ఈ విషయంలో కాస్త గొడవ జరిగిందని.. అది కూడా పెద్దదిగా మారిందని.. ఈ విషయం అటు మోహన్ బాబు వంటి వారికి తెలిసింది అని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్నాక మోహన్ బాబు ఫోన్ చేసి తమను రమ్మన్నారని తెలిపారు.

- Advertisement -

మళ్లీ ఒక్కటయ్యాము..

అలా వెంటనే మోహన్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ పరిస్థితిని వివరించానని తెలిపారు. అయితే మోహన్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ పరిటాల రవి కూడా ఉన్నారు.. అయితే గొడవలు ఎందుకు సైలెంట్ గా ఉండండి అంటూ సూచించారు.. కానీ ఆ సమయానికే తాను బ్రహ్మానందంతో అన్ని విషయాలు సెట్ చేసుకున్నానని చెప్పడంతో.. మోహన్ బాబు కూడా తమను మెచ్చుకున్నారని శివాజీ రాజా తెలిపారు. అలా బ్రహ్మానందం తన మధ్య ఒక పెద్ద గొడవ వచ్చినా కూడా వాటిని మళ్లీ తిరిగి సాల్వ్ చేసుకున్నామని తెలియజేశారు శివాజీ రాజా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు