Natasa Stankovic.. గత కొంతకాలంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రముఖ బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. ఎందుకంటే నటాషా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి హార్దిక్ తో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పూర్తిగా డిలీట్ చేశారు.. కేవలం తన కుమారుడు అగస్త్య తో మాత్రమే దిగిన ఫోటోలను ఆమె తన ఇన్స్టా లో ఉంచడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. టీ20 వరల్డ్ కప్ 2024 ..భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాని నటాషా స్టాంకోవిక్ కనీసం విష్ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరం.. దేశవ్యాప్తంగా పలువురు అభిమానులు, సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు, అధికారులు హార్దిక్ పాండ్యాకు శుభాకాంక్షలు చెబుతుంటే భాగస్వామి అయిన నటాషా కనీసం ఒక రిప్లై కూడా ఇవ్వకపోవడంతో విడాకుల వార్తలు నిజమే అంటూ వార్తలు జోరందుకున్నాయి.. అయితే ఇప్పుడు మరో సాక్ష్యం తెరపైకి వచ్చింది.
అంబానీ ఈవెంట్తో విడాకులపై క్లారిటీ..
తాజాగా అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు పలువురు బాలీవుడ్ స్టార్స్ జంటలుగా విచ్చేసి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో సందడి చేస్తున్నారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలలో బాలీవుడ్ స్టార్స్ జంటలు జంటలుగా వచ్చి ఫోటోలు దిగుతున్నారు.. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఒంటరిగా వచ్చి ఆ బాధను తన ముఖంలో చూపించకుండా నిర్జీవమైన స్మైల్ తో అభిమానులలో సరికొత్త అనుమానాలను క్రియేట్ చేశాడు.. దీన్ని బట్టి చూస్తే ఇక నిజంగానే నటాషా, హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయని.. విడాకులు తీసుకున్నారు అని స్పష్టం అవుతుంది. మొత్తానికి అయితే ఇన్ని రోజులు బయటపడని ఈ జంట.. ఇప్పుడు అంబానీ ఇంట వేడుకలతో బయటపడిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ప్రాణం పెట్టి ఆడిన హార్దిక్..
ఇకపోతే హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో ప్రాణం పెట్టి ఆడేశాడు అని చెప్పడంలో సందేహం లేదు. మూడు ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్స్ పడగొట్టాడు టోర్నీ ఆశాంతం ఆల్రౌండర్ గా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.. దీంతో పలువురు హార్దిక్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. కానీ నటాషా మాత్రం ఒక్క పోస్టు కూడా పెట్టలేదు దీంతో హార్దిక్ నటాషాలు విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరొకవైపు రోహిత్ సతీమణి రితిక, కూడా విరాట్ సతీమణి ప్రముఖ హీరోయిన్ అనుష్క తమ భర్తల ఆటపై సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టు చేసిన విషయం తెలిసిందే.
నటాషా పోస్ట్..
దీనికి తోడు మొన్న నటాషా పెట్టిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మనం జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటాం .. ఎంతో నిరుత్సాహ పడతాం.. బాధను అనుభవిస్తాం.. అలాంటి సమయంలో ఎవరు తోడుగా లేరని బాధపడాల్సిన అవసరం లేదు.. మనకు ఏం కావాలో దేవుడికి తెలుసు భగవంతుడు వద్ద ఒక ప్రణాళిక ఉంటుంది.. అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది నటాషా. ఇక ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అంబానీ ఇంట వేడుకలతో నటాషా , హార్దిక్ విడాకులు తీసుకున్నారనే విషయం స్పష్టం అవుతోంది.
the pain in his smile. 🥺 pic.twitter.com/uY2fZw7AJY
— narsa. (@rathor7_) July 6, 2024