YetoVellipoyindiManasu ReRelease : టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ లో ఇప్పుడు అన్ని రకాల సినిమాలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బ్లాక్ బస్టర్ అయిన పాత సినిమాలనే రిలీజ్ చేస్తుండగా, ఆరెంజ్ సినిమా తర్వాత ప్లాప్ అయి క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రాలను కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేసారు. ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది, ఓయ్ వంటి సినిమాలు థియేటర్లలో అప్పట్లో అంతగా ఆడకపోగా, రీ రిలీజ్ అయి థియేటర్లలో అదరగోట్టాయి. ఇప్పుడు అలాంటి ఒక అండర్రేటెడ్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. నాని, సమంత జంటగా నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” సినిమా గుర్తుండే ఉంటుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.
మ్యూజికల్ క్లాసిక్ రీ రిలీజ్ కి రెడీ..
ఇక నాని సమంత జంటగా నటించిన ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాను (YetoVellipoyindiManasu ReRelease) గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఓన్ ప్రొడక్షన్ లో తేజ సినిమాస్ వారితో కలిసి నిర్మించాడు. ఈ సినిమా 2012 డిసెంబర్ 12న విడుదలైంది. మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం అంతగా ఆడలేదు. విడుదలకు ముందే పాటలు కూడా పెద్ద హిట్టయ్యాయి. కానీ ఎందుకో అప్పట్లో జనాలకు అంతగా ఎక్కలేదు. పైగా టెలివిజన్ లో కూడా దాదాపు ఏడాదిన్నర తర్వాత టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే మెల్లిమెల్లగా పాటల ద్వారా సినిమా జనాల్లోకి వెళ్ళింది. టీవీల్లో పెద్దగా వేయకపోయినా, డిజిటల్ రిలీజ్ ద్వారా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుని అండర్రేటెడ్ క్లాసిక్ గా మిగిలిపోయింది.
ఇప్పుడైనా మెప్పిస్తుందా?
ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీని ఆగష్టు 2న రీ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారని తెలిసిందే. ఇక ఈ సినిమాను గౌతమ్ మీనన్ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించగా, తమిళ్ లో జీవా హీరోగా నటించగా, అక్కడ కూడా సమంతనే హీరోయిన్ గా నటించింది. ఇక ఆరెంజ్, ఓయ్ లాంటి సినిమాలని రీ రిలీజ్ లో బాగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. మరి ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని ఆడియన్స్ ఇప్పుడైనా ఆదరిస్తారా చూడాలి.