Khushboo: 24 ఏళ్ల తర్వాత తన పెళ్లిలో జరిగిన నిజాన్ని బయటపెట్టిన ఖుష్బూ..!

Khushboo:తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్ ఖుష్బూ గురించి.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజకీయ నాయకురాలుగా కూడా ముందుకు సాగుతూనే.. మరొకవైపు నిర్మాతగా.. టీవీ యాంకర్ గా.. పలుశోలకు జడ్జిగా కూడా తన సత్తా చాటుతోంది ఖుష్బూ.. 1980 లో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా ఎన్నో భాషలలో నటించిన ఈమె.. ఇప్పటికీ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూనే ఉంది. వరుసగా 16 చిత్రాలను విడుదల చేసి.. అన్నింటితో హిట్ అందుకున్న ఘనత అందుకుంది ఖుష్బూ. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పెళ్లిలో జరిగిన ఒక సంఘటనను 24 ఏళ్ల తర్వాత తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

Khushboo: After 24 years, Khushbu revealed the truth about her marriage..!
Khushboo: After 24 years, Khushbu revealed the truth about her marriage..!

కుష్బూ సుందర్ ప్రేమ పెళ్లి..

2000 వ సంవత్సరంలో ఖుష్బూ.. డైరెక్టర్ సుందర్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమార్తెలు.. అందులో ఒకరు అవంతిక కాగా..మరొకరు అనంతిక.. ఖుష్బూ భర్త సి.సుందర్ కూడా తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించారు. సుందర్, ఖుష్బూ కాంబినేషన్లో వచ్చిన మాత్రమామన్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ సుందర్ కుష్బూకి సైతం లవ్ ప్రపోజ్ చేసినట్లుగా తెలియజేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. పెద్దలను ఒప్పించి మరీ వీరు వివాహాన్ని చేసుకున్నారట.

మమ్మల్ని ఆశీర్వదించి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు…

ఈ నేపథ్యంలోనే తన పెళ్లిలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి కుష్బూ ఇలా మాట్లాడుతూ..నాతో పెళ్లి సంబంధాన్ని.. ముందుగా సుందర్ మొదట కార్తీక్ తో ఖుష్బూ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారట.. ఈ విషయం తెలిసిన కార్తీక్ నాకు ఫోన్ చేసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.. అలాగా నా పెళ్లికి వచ్చి ఆశీర్వదించారని తెలిపింది.. వివాహమైన అనంతరం నేను , సుందర్ ఇద్దరం కలిసి కార్తీక్ కాళ్ల పైన పడి ఆశీర్వాదం తీసుకున్నామని అప్పుడు కూడా ఆయన కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు వస్తూనే ఉన్నాయంటూ వెల్లడించింది ఖుష్బూ.

- Advertisement -

ప్రత్యేకంగా గుడి కట్టిన అభిమానులు..

కోలీవుడ్లో స్టార్ హీరోలైన రజినీకాంత్ , కమలహాసన్, శరత్ కుమార్ ,సత్యరాజ్ ఇతరత్రా హీరోలతో కూడా కలిసి నటించింది.. తెలుగులోనే కాకుండా తమిళ్ ,కన్నడ, మలయాళం వంటి భాషలలో కుష్బూ 200 కి పైగా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా తమిళంలోనే వందకు పైగా సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది. ఈమె నటనకు ఫిదా అయిన అభిమానులు సైతం ఏకంగా ఈమెకు గుడి కట్టారంటే ఈమె క్రేజ్ తమిళనాడులో ఏవిధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈమెను తమిళ ప్రేక్షకులు అభిమాన దేవతగా భావిస్తారు ఇక చిరంజీవి వంటి హీరోలకు పక్కగా కూడా కలిసి నటించింది అందుకే అటు తెలుగు ఇటు తమిళ్ అన్ని భాషల్లో కూడా కుష్బూ నటనకు ఫిదా కానీ వారంటూ ఎవరు ఉండరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు