Pawan Kalyan: ఆ నిర్మాతతో గొడవకు కారణం అదేనా..?

Pawan Kalyan.. తెలుగు సినీ పరిశ్రమను ఒక స్థాయికి తీసుకువెళ్లినటువంటి వారిలో ప్రముఖ నిర్మాత రామానాయుడు కూడా ఒకరు. ఎన్నో భాషలలో సినిమాలు తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా సంపాదించుకున్నారు. ఎంతో మంచి మనిషిగా పేరు పొందడమే కాకుండా నిర్మాతగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రామానాయుడు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు అయినటువంటి వెంకటేష్, సురేష్ బాబు కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ సీనియర్ హీరోలలో అగ్ర హీరోగా ముందుకు వెళ్తున్నారు. ఇక సురేష్ బాబు తన బ్యానర్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.

Pawan Kalyan: Is that the reason for the fight with the producer..?
Pawan Kalyan: Is that the reason for the fight with the producer..?

అందరూ కమల్ హాసన్ అని పిలిచేవారు..

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో థియేటర్లను లీజుకు తీసుకోవడమే కాకుండా నిర్మిస్తూ పలు రకాల చిత్రాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలలో తలదూర్చరు సురేష్ బాబు, వెంకటేష్ . అలాంటిది సురేష్ బాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు..తన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని అంశాల పైన తెలియజేయడం జరిగింది. యుక్తవయసులో ఉన్నప్పుడు తనని అందరూ చూసి కమలహాసన్ అనే వారని తెలిపారు. అంతేకాకుండా కమలహాసన్ కారు కూడా ఒకే మోడల్ కావడం వల్ల అలా పిలిచేవారని వెల్లడించారు.

హీరోగా అవకాశం కానీ..

అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ భారతి రాజా తనని హీరోగా ఒక సినిమా తీయడానికి ముందుకు వచ్చారని.. అయితే తనకు పెద్దగా హీరోగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ విషయాన్ని రిజెక్ట్ చేశానని.. మొదటి నుంచి తనకి వ్యాపారం చేయాలని ఆలోచన ఉండేదని అందుకు తగ్గట్టుగానే తన తండ్రి అడుగుల్లో నిర్మాతగా మారానని తెలియజేశారు సురేష్ బాబు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమా విషయంలో జరిగినటువంటి గొడవను గురించి కూడా యాంకర్ ప్రశ్నించగా తెలియజేశారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ తో విభేదాలపై క్లారిటీ..

పవన్ కళ్యాణ్ తనకు మంచి స్నేహితుడని.. మా మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చాయని ..ఆ తర్వాత వాటి విషయములో సర్దుకున్నామని వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడు సంతోషించిన మొదటి వ్యక్తిని నేనే అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ తో జరిగిన గొడవపైన అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదు సురేష్ బాబు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సురేష్ బాబు పవన్ కి మధ్య రెమ్యునరేషన్ విషయంలోనే గొడవలు జరిగాయని వార్తలు వినిపించాయి. మొదట పవన్ కళ్యాణ్ 30 రోజులపాటు కాల్ షీట్లు ఇవ్వగా.. అదే పారితోషకానికి.. మరో 15 రోజులు అదనంగా అడగడంతో పవన్ కళ్యాణ్ నో అని చెప్పారని.. అందుకే వీరిద్దరి మధ్య గొడవ వచ్చిందని వార్తలు వినిపించాయి.

పవన్ కళ్యాణ్ స్పందిస్తారా..

అయితే ఆ తర్వాత సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకోవడంతో అన్నీ సద్దుమనిగిపోయాయని తాజా ఇంటర్వ్యూలో సురేష్ బాబు తెలియజేయడం జరిగింది. మరి ఈ ఇష్యూ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా అందిస్తారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు