Tollywood Heroine: ఎన్నో అనుకుంది.. కానీ పెళ్ళైన 6 నెలలకే విడాకులు..కష్టాల కడలిలో..!

Tollywood Heroine.. సెలబ్రిటీలు అనగానే లగ్జరీ లైఫ్.. భారీగా ఆస్తులు, ఏమైనా చేయొచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కానీ ముఖానికి రంగు తీసేసిన తర్వాత చూస్తే ఎన్నో కష్టాలు.. బాధలు.. కన్నీళ్లు ఇలా ఎన్నో.. తమ జీవితంలో చెప్పుకోలేని వాటితో సతమతమవుతున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ జీవితం కూడా ఇలాంటిదే అని చెప్పవచ్చు. 1990వ దశకంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మనీషా కొయిరాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది.

Tollywood Heroine: She thought a lot.. But after 6 months of marriage, she got divorced..
Tollywood Heroine: She thought a lot.. But after 6 months of marriage, she got divorced..

2000 వ దశకంలో అగ్రతారగా..

మనీషా కొయిరాల పుట్టింది నేపాల్.. కానీ ఎక్కువగా ఇండియన్ సినిమాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అప్పట్లో ఈమె సినిమా చేసింది అంటే చాలు కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేది.. నిర్మాతలకు కూడా మంచి లాభాలు లభించేవట. సౌత్ లో తక్కువ సినిమాలలో నటించినా.. నార్త్ లో కొన్నేళ్లపాటు ఈమె హవా ఓ రేంజ్ లో కొనసాగింది. 2000 దశకంలో ఈ సీనియర్ హీరోయిన్ వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్ గా గడిపేసిందట. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పర్సనల్ లైఫ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం తెలియజేసింది.

వివాహమైన ఆరు నెలలకే విడాకులు.. నరకం..

ముఖ్యంగా వివాహమైన తర్వాత తన బర్తడే తనకు శత్రువుగా మిగిలారని తన భర్తకు.. తన పైన ఎప్పుడూ ప్రేమ ఉండేది కాదని.. కేవలం పెళ్లి అనే పేరు కోసమే ఇద్దరం చేసుకున్నామని తెలియజేసింది మనీషా కొయిరాలా. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త శత్రువుగా మారడం.. తన జీవితంలో జరిగిన దారుణం ఇదే అని తెలిపింది. అందువల్లే తన భర్తకు విడాకులు ఇచ్చానని కూడా తెలియజేసింది. 2010 వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త సామ్రాట్ దహళ్లను వివాహం చేసుకున్నప్పటికీ .. ఆ వివాహాన్ని కూడా ఆరునెలల కంటే ఎక్కువగా ఉండలేక విడాకులు బాట పట్టింది మనీషా కొయిరాలా.

- Advertisement -

ఒంటరి జీవితం..

ఆ తర్వాత నుంచీ ప్రస్తుతం ఒంటరిగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నది. తెలుగులో క్రిమినల్ సినిమాతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బాంబే అనే సినిమాలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకొంది మనీషా కొయిరాల. రీసెంట్గా హీరమండి వెబ్ సిరీస్ లో కూడా కనిపించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే మనీషా కొయిరాలా సినీ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో ఏకంగా 12 మందితో ఎఫైర్ నడిపినట్లుగా బాలీవుడ్ మీడియాలో అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈమె గురించి మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

క్యాన్సర్ తో పోరాటం..

మరోవైపు క్యాన్సర్ ను కూడా ఈమె జయించింది… క్యాన్సర్ తో పోరాడి చావు చివరి అంచుల వరకు వెళ్లి తిరిగి విజయంగా బయటపడగలిగింది మనీషా కొయిరాలా .. ఎంతో పాపులారిటీ ఉన్నా సరే.. ఎన్నో కష్టాలను అనుభవించి.. ఇప్పుడు ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు