Varalakshmi Sarathkumar.. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా వివాహం చేసుకొని కొత్త బంధంలోకి అడుగు పెట్టింది.. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి ఏడడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. థాయిలాండ్ వేదికగా జూలై 2వ తేదీన ఘనంగా వీరి వివాహం జరగగా.. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు .. వీరి వివాహ వేడుకలో సందడి చేశారు.. అంతే కాదు ఆ తర్వాత రెండు రోజులకు చెన్నైలో గ్రాండ్ గా తాజ్ హోటల్లో రిసెప్షన్ కూడా జరిపించారు.. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించగా… ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వరలక్ష్మీ పెళ్లి ఖర్చు రూ.200 కోట్లు..
ముఖ్యంగా టాలీవుడ్ , కోలీవుడ్ కు సంబంధించిన సీనియర్ , జూనియర్ స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. ఈమె వివాహానికి ఎంత ఖర్చయింది అంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వరలక్ష్మి శరత్ కుమార్ వివాహానికి రూ .200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ..అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం..
రూమర్ల పై స్పందించిన శరత్ కుమార్..
అయితే తాజాగా ఈ విషయాలపై స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి ప్రముఖ నటుడు శరత్ కుమార్…” అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు.. ప్రస్తుతం వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం … ఏమీ తెలియకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి.. పెళ్లి కోసం అంత ఖర్చు చేయడమేంటి..? చాలా సింపుల్ గానే నేను నా కూతురు వివాహాన్ని జరిపించాను.. ముఖ్యంగా నిజాలేంటో తెలియకుండానే ఊహించుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సమంజసం కాదు” అంటూ శరత్ కుమార్ రూమర్స్ కి చెక్ పెట్టారు.
రూమర్స్ కి ఆజ్యం పోసింది అక్కడే..
అయితే ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే ముంబైలోని అత్యంత సంపన్నులలో నికోలాయ్ సచ్ దేవ్ కూడా ఒకరు.. అక్కడ ఆయనకు ఒక సొంత ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది.. రూ.900 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.. ఆయనకు ఇదివరకే వివాహం జరిగి..15 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది.. 11 ఏళ్లుగా ప్రేమించుకున్న వీరు ఇప్పుడు వివాహం చేసుకున్నారు.. పైగా వివాహ వేడుక సందర్భంగా నికోలాయ్ తన భార్యకు బంగారు చెప్పులు, డైమండ్ చీర బహుమతిగా ఇచ్చాడని సమాచారం.. వీటి విలువ కూడా రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని.. అందుకే వీరి వివాహానికి ఇంత ఖర్చు చేశారు అని వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయాలపై శరత్ కుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికైతే ఈ విషయాలపై నిజాలు తెలియాలి అంటే వరలక్ష్మి స్పందించక తప్పదు.