TillU Cube : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’.. ఈ సినిమా డిజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా వచ్చి హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. టిల్లు స్క్వేర్తో రూ.150 కోట్ల క్లబ్లో చేరిపోయాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘టిల్లు క్యూబ్’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు టాక్..
ఈ ఏడాది అనుపమ, సిద్దు కాంబోలో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రైమ్ కామెడీ బాక్సాఫీస్ వద్ద రూ. 155 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.. ఇప్పటికి సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా గురించి సిద్దు ఓ ఇంటర్యూ లో చెప్పాడు.. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని ఎప్పుడో టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో టాక్సివాలా సినిమా హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది..
ఇక ఈ సినిమాలో హీరో కొత్తగా కనిపించబోతున్నట్లు గతంలో సిద్దు చెప్పిన సంగతి తెలిసిందే.. సూపర్ పవర్స్ ఉన్నట్లు సరికొత్తగా కథ ఉందని తెలుస్తుంది.. అంతేకాదు ఈ మూవీలో మరో స్టార్ హీరోను దింపుతున్నట్లు తెలుస్తుంది.. సిద్ధు జొన్నలగడ్డ రైటర్గా కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.. ఇక డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించింది. టిల్లు క్యూబ్ లో ప్రియాంక జువాల్కర్ ను హీరోయిన్ను తీసుకోబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే…