Director Maruthi : తెరపై హీరో హీరోయిన్ల జంట ఎంత అందంగా ఉందో అని మురిసిపోతారు అభిమానులు. కానీ సెట్స్ లో జరిగే వివాదాల గురించి మాత్రం చాలావరకు ఎవరికీ తెలియదు. వివాదం దుమారంగా మారితే తప్ప సెట్లో జరిగిన గొడవల గురించి బయట ఎక్కడా ఎవ్వరూ ప్రస్తావించరు. అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ మారుతి నయనతార తల పొగరు వేషాల గురించి బయటపెట్టారు. విక్టరీ వెంకటేష్ ని ఆమె దారుణంగా అవమానించింది అంటూ కామెంట్స్ చేశారు. ఇంతకీ వీరిద్దరి మధ్య జరిగిన వివాదం ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…
నయనతారతో మారుతి గొడవ
ఈరోజుల్లో, బస్ స్టాప్ ప్రేమ కథా చిత్రం లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్ సినిమాలు తీసి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత నానితో భలే భలే మగాడివోయ్ సినిమాను తీసి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే వెంకీ మామ దగ్గర నుంచి పిలుపు రావడంతో మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా తెరకెక్కింది.. ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించగా, ఆయన సరసన నయనతార కథానాయికగా కనిపించింది. అయితే ఈ మూవీ సెట్లో నయనతారతో గొడవ జరిగింది అనే వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. కానీ ఈ వివాదం గురించి డైరెక్టర్ మారుతి ఎక్కడా నోరు విప్పలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలు ఈ గొడవ అంతా ఎందుకు జరిగింది అనే విషయంపై మొట్టమొదటిసారి మారుతి స్పందిస్తూ క్లియర్ గా వివరించారు.
నయనతారకు ఇంత తల పొగరా?
రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో నయనతారపై డైరెక్టర్ మారుతి సంచలన కామెంట్స్ చేశారు. బాబు బంగారం మూవీ షూటింగ్ టైంలో నయనతార, మారుతికి మధ్య వాగ్వాదం జరిగిందట. మారుతి మాట్లాడుతూ బాబు బంగారం సెట్ లో నయనతార చిత్ర యూనిట్ లో ఎవరికీ సహకరించేది కాదని వెల్లడించారు. అప్పటికి తాను పెద్ద డైరెక్టర్ ని కాదు అనుకున్నప్పటికీ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలను కూడా లెక్క చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో చాలావరకు ఎంతో ఓపికగా ఉన్న తాను ఒకానొక సమయంలో సహనం నశించి ఆమెతో వాగ్వాదానికి దిగానని చెప్పుకొచ్చారు. దీంతో నయనతార షూటింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్లి పోయిందని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసి ఓ పాట బాలన్స్ ఉంది షూట్ చేయాలి రమ్మంటే.. డేట్స్ ఖాళీ లేవు అనే సాకుతో అవాయిడ్ చేసిందట. దీంతో చేసేదేం లేక ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేశామని మారుతి తెలిపారు. ఇంకేముంది మారుతీ చెప్పిన విషయం వైరల్ కావడంతో నయనతారకు టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకరైన వెంకీ మామనే అవమానించేటంత తల పొగరా? అంటూ మండిపడుతున్నారు ఆయన అభిమానులు. కాగా ప్రస్తుతం మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.