Dushara Vijayan : సినిమాల నుంచి తప్పుకుంటా… ధనుష్ హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్

Dushara Vijayan : సినిమా ఇండస్ట్రిలో హీరోయిన్లు ఒక్కసారి క్లిక్ అయితే ఆ తరువాత వెనక్కి తిరిగి చూడరు. లైఫ్ లాంగ్ వీలైనన్ని రోజులు సినిమాలకే తమ జీవితాలను అంకితం ఇవ్వాలని అనుకుంటారు. మధ్యలో బ్రేక్ ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి కలలో కూడా అంత ఈజీగా వీటి గురించి ఆలోచించరు. ఒకవేళ డేటింగ్ లాంటివి చేసినా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. కానీ తాజాగా ఓ హీరోయిన్ మాత్రం సినిమాల నుంచి తప్పుకుంటాను అంటూ బాంబ్ పేల్చింది. ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతున్న ఈ హీరోయిన్ ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసుకుందాం పదండి.

సినిమాలను వదిలేస్తానని కామెంట్స్

తమిళ హీరోయిన్ దుషార విజయన్ ‘సర్పత్త పరంబరై’ చిత్రంతో కోలీవుడ్ లో తమిళ తంబీలకు అత్యంత ఇష్టమైన నటీమణులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రాయాన్’ సినిమాలో నటిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా జూలై 26న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ జూలై 6న చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దుషార మాట్లాడుతూ ఆ సినిమా తన వ్యక్తిగత విజయమని చెప్పుకొచ్చింది.

Dushara Vijayan: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది.. నాకు హద్దులు తెలుసు..  హీరోయిన్ దుషారా కామెంట్స్.. - Telugu News | Tamil actress Dushara Vijayan  Interesting Commets about Glamour ...

- Advertisement -

ఇక రాయన్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన దుషార తాను ధనుష్‌కి వీరాభిమానిని అని, అతనితో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నానని వెల్లడించారు. ‘రాయాన్’కి ఆయన దర్శకత్వం వహించడం, నటించడం, తాను కూడా ఆ సినిమాలో భాగం అవ్వడం తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అంటూ సంబరపడింది. అలాగే ధనుష్ ను ప్రశంసలతో ఆకాశనికెత్తేసిన దుషార తాను 35 ఏళ్లకే నటన మానేయాలనుకుంటున్నానని చెప్పి బాంబు పేల్చింది.

సినిమా కాకుండా ఫ్యూచర్ ప్లాన్స్

దుషార విజయన్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తూ, పూర్తిగా ప్రయాణాలపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నానని వెల్లడించింది. 35 ఏళ్ల వయసులో నటనను ఆపివేస్తానని ప్రకటించిన దుషార వరల్డ్ టూర్ వేయాలన్నదే తన ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పుకొచ్చింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వను అని చెప్పట్లేదు కానీ ఈ ప్రపంచంలో నేను కాలు పెట్టని ప్లేస్ ఉండకూడదు అన్నదే నా డ్రీం అని పేర్కొంది. మొత్తానికి డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఆమె సినిమాలను వదిలేస్తానని అనడం అభిమానులకు షాకింగ్ గా మారింది. దుషారా ‘సర్పట్ట పరంబరై’ చిత్రంలో ‘మరియమ్మ’ పాత్ర గురించి కూడా మాట్లాడింది. సీక్వెల్‌లో తన పాత్ర కొనసాగుతుందా లేదా అనేది ఖచ్చితంగా తెలియదని పేర్కొంది. ఈసారి తన పాత్రను మరింత ఘాటుగా పోషిస్తానని చెప్పింది.

కాగా దుషార ప్రస్తుతం ‘రాయాన్’ కాకుండా రజనీకాంత్ ‘వెట్టయన్’లో కూడా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్‌లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, రితికా సింగ్, మంజు వారియర్ కూడా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చేసిన ‘ వీర ధీర శూరన్’ సినిమాలో విక్రమ్‌తో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు