Double Ismart : టాలీవుడ్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ఒకటి. రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా హీరో రామ్ పోతినేని, అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దేనికంటే ముందు వరుస ప్లాప్ లు అందుకున్నారు. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో సీక్వెల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజీ అంచనాలున్నాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసేశారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఇంట్రెసింగ్ అప్డేట్ వచ్చింది.
పూరిజగన్నాథ్ కి ఆ నిర్మాత క్రేజీ ఆఫర్..
డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాని పూరి జగన్నాథ్ దర్శకత్వం మాత్రమే కాకుండా స్వీయ నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ గురించి తాజాగా నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. డబుల్ ఇస్మార్ట్ యొక్క థియేట్రికల్ బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఆ మధ్య ఏషియన్ సునీల్, సురేష్ బాబు కలిసి రూ.36 కోట్ల ఆఫర్ ఇచ్చారట. కానీ, పూరి ఏకంగా రూ.63 కోట్లు డిమాండ్ చేస్తుండటంతో ఈ డీల్ క్యాన్సిల్ అయిందని టాక్. అయితే కాగా, తాజాగా ఈ రైట్స్ కోసం ‘హనుమాన్’ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి దాదాపు రూ.45 కోట్ల సాలిడ్ ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పూరి కొన్ని షరతుల మీద నిర్మాత నిరంజన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నాడని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలి.
పూరి ఓన్ రిలీజ్ చేస్తాడా?
ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ ని ఏకంగా 60 కోట్ల రేంజ్ లో అమ్మాలని పూరి ప్లాన్ చేస్తున్నాడని, అది కుదరకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఓన్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడని టాక్. మరి దీనిపై కూడా క్లారిటీ రావాలి. మరి నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే మేకర్స్ నుండి థియేట్రికల్ రైట్స్ గురించి కన్ఫర్మేషన్ రావాలి. ఇకపోతే ఈ సినిమాలో రామ్ మరోసారి ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ గా అదే పాత్రలో నటిస్తుండగా, ఫస్ట్ పార్ట్ లో నటించిన శియాజి షిండే, గెటప్ శీను వంటి నటులు రెండో పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈ సీక్వెల్ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోండగా, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.