Anasuya Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కీలకపాత్రలో నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. Anasuya Bharadwaj
ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాల్లో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఎనర్జీతో అద్భుతంగా నటిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలోనే కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోతో బుల్లితెరకు మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. Anasuya Bharadwaj
ఇక దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇక అందులో భాగంగానే అనసూయ గురించి ఎన్సిసి ట్రైనింగ్ ఆఫీసర్ సరోజ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. అనసూయ కాలేజ్ చదువుకునే రోజుల్లో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదట. అనసూయ కోసం అబ్బాయిలు వెంటపడుతూ ఉండేవారట. ఇక ఈ విషయాన్ని అనసూయ కాలేజ్ టీచర్ చెప్పుకొచ్చింది.
అలా అబ్బాయిలు వెంటపడుతున్న సమయంలో అనసూయ వారి కంటపడకుండా దాచుకునేదట. ఆ సమయంలో అనసూయను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉండేదట. అనసూయ వారి కంటపడకుండా దాచుకునే సందర్భాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయట. వాటిని సుశాంక్ చూడటం…. అనసూయ అందానికి అతను ఫిదా అవడం జరిగిందట. ఇక అప్పటినుంచి అనసూయని లవ్ లో పడేసే పని సుశాంక్ భరద్వాజ్ పెట్టుకున్నాడట.