Janvi Kapoor : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో 12న జరగనుంది. ఇప్పటికే పెళ్లి వేడుకలు జరుగుతుండగా బాలీవుడ్ స్టార్స్ అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిపోతున్నారు. కాగా ఈ ఈవెంట్ లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన బాయ్ ఫ్రెండ్ పహరియాతో కలిసి తెగ సందడి చేసింది. అయితే అందరి కళ్ళూ జాన్వి డిజైనర్ లెహంగాతో పాటు ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్ హైలెట్ గా నిలిచింది.
ఆ నెక్లెస్ ధర అరకోటి
ముంబైలో జరుగుతున్న అనంత అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో తోపాటు పలువురు నటీనటులు పాల్గొంటున్నారు. అయితే అందరిలోనూ ఆరెంజ్ కలర్ డిజైనర్ చోలీ లెహంగా, దుపట్టాలో జాన్వీ కపూర్ ఈ ఈవెంట్లో సెంటరాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో హాట్ టాపిక్ అయిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఈ ఫంక్షన్లో హజారీలాల్ లెగసీ జ్యువెలరీ బ్రాండ్కు చెందిన రాళ్లతో పొదిగిన నెక్లెస్ను ధరించింది. కానీ ఆ నెక్లెస్ ధర వింటే షాక్ అవుతారు. జాన్వి వేసుకున్న ఆ నెక్లెస్ విలువ రూ. 52 లక్షలు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు నోరెళ్ళ బెడుతున్నారు. ఆ ఒక్క నెక్లెస్ ధరతో ఓ పేద కుటుంబం లైఫ్ లాంగ్ సంతోషంగా బతకొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అంబానీ లాంటి ఫ్యామిలీ వెడ్డింగ్ కి ఇన్విటేషన్ వస్తే ఆ మాత్రం హంగు ఆర్భాటం ఉండాల్సిందే కదా అంటున్నారు జాన్వి అభిమానులు.
ఇక జాన్వి బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా తెల్లటి ప్యాంటు, నీలిరంగు సీక్విన్డ్ కుర్తాలో అందంగా కనిపించాడు. థీమ్ కు కరెక్ట్ గా సరిపోయే డ్రెస్ వేసుకుని శిఖర్ పహరియా అదరగొట్టాడు. జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మామెరు వేడుక ఆంటిలియా హౌజ్ లో జరిగింది. వీరితో పాటు, అంబానీ లేడీస్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో తమ స్పెషల్ లుక్స్ తో షేక్ చేశారు. నీతా అంబానీ నుండి శ్లోకా మెహతా అంబానీ వరకు అందరూ తమ దుస్తుల్లో రాచరికంగా కనిపించారు. ఈ సంగీత వేడుకలో హాలీవుడ్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్, బాద్షా వంటి ప్రముఖుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో స్టేజ్ దద్దరిల్లింది
ఇదిలా ఉండగా జాన్వి ప్రస్తుతం దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అనంత్ అంబానీ-రాధికల పెళ్లి ప్లాన్స్
రాధిక, అనంత్ల వివాహా ప్రధాన వేడుకలు శుక్రవారం జూలై 12న శుభ వివాహ లేదా వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. అతిథులు సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరించడం పెళ్లి థీమ్. జూలై 13, శనివారం శుభ్ ఆశీర్వాద్తో వేడుకలు కొనసాగుతాయి. చివరి కార్యక్రమం మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ ఆదివారం జూలై 14న జరగనుంది.