Dil Raju: మలయాళం దర్శకుడికి అవకాశం ఇవ్వనున్న దిల్ రాజు

Dil Raju: తమిళ నటుడు శింబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటుడు నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, సంగీత దర్శకుడు రాజేంద్ర కుమారుడుగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శింబు. మొదట కొన్ని సినిమాల్లో బాల నటుడుగా కనిపించాడు శింబు. అయితే 2002లో వచ్చిన కాదల్ అజ్హివతిల్లై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన దమ్, అలై, కోవిల్, కుత్తు వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి. కానీ శింబు కు తెలుగులో గుర్తింపు వచ్చిన సినిమా మాత్రం మన్మధ అని చెప్పొచ్చు. ఇదే సినిమాని తమిళ్ లో మన్మధన్ తెరకెక్కించారు.

మన్మధ సినిమాలో రెండు పాత్రలలో కనిపిస్తాడు శింబు. ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించుకుంది. అయితే శింబు తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమే. శింబు చేసిన కొన్ని సినిమాలు తెలుగులో మంచి పేరును సాధించాయి. అందరికీ శింబు కెరియర్ లో బాగా గుర్తుండే సినిమా అంటే వల్లభ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి దర్శకుడుగా, రచయితగా కూడా పనిచేసాడు శింబు. ఇకపోతే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన “విన్నయ తాండ వరువాయ” సినిమా శింబుకి మంచి పేరును తీసుకొచ్చింది. ఇదే సినిమా తెలుగులో “ఏ మాయ చేసావే” పేరుతో రిలీజ్ అయింది.

Simbu

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు శింబు. రీసెంట్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన మానాడు సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఇకపోతే ప్రస్తుతం శింబు 48వ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత శింబు మలయాళం దర్శకుడు తో పని చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. 2018 సినిమా డైరెక్టర్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ తో శింబు సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు