Prabhas: ఆ సినిమా చేస్తున్నప్పుడు కే విశ్వనాథ్ గారు పిలిచి తిట్టారు

Prabhas: ఈశ్వర్ సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. అయితే ప్రభాస్ కు మాత్రం మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. బాక్సాఫీస్ వద్ద సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. అక్కడ నుంచే ప్రభాస్ కి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాతో ప్రభాస్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత చేసిన డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేశాయి. గురు జగనన్న దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు ఏక్ నిరంజన్ వంటి సినిమాలు యూత్ లో ఒక ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టాయి.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని మొదటిసారి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారా అని అందరికీ తెలిసి వచ్చిన పరిణామం అది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ వచ్చింది. అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచినా కూడా, మినిమం కలెక్షన్స్ అయితే వచ్చాయి అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రీసెంట్ గా కలిగే సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు ప్రభాస్.

Chatrapathi

- Advertisement -

ఇక ప్రభాస్ కి రాజమౌళికి మధ్య ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చత్రపతి అనే సినిమాకి వర్క్ చేసిన తరుణంలో ప్రభాస్ చుట్టూ చాలామంది ఉండటం వలన నేను అంతమంది ఉన్నారు డైలాగ్ గట్టిగా చెప్పలేను స్లోగా చెప్తాను అంటూ స్లోగా చెప్పారట. అయితే అలా స్లో గా చెప్పినా కూడా రాజమౌళి దానిని ఓకే చేసేసారట. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేస్తున్నప్పుడు కే విశ్వనాథ్ గారితో స్లోగా డైలాగ్స్ అని చెప్పినప్పుడు. ఆయన షాట్ అయిపోయిన తర్వాత పిలిచి ఇన్ని సినిమాలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు ఇలా స్లోగా చెప్తే ఎలా అంటూ పిలిచి మాట్లాడారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు