Darshan – Pavitra Gowda.. అభిమాని రేణుకా స్వామి (28) హత్య కేసులో హీరో దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రముఖ సీరియల్ నటి పవిత్ర గౌడ, హీరో దర్శన్ ఇద్దరికీ జైలు శిక్ష పడింది. ఇక వీరిద్దరిని చూడడానికి సెలబ్రిటీలు ,కుటుంబ సభ్యులు జైలు దగ్గరికి వెళ్తుండగా.. ఇప్పుడు నటి పవిత్రను చూడడానికి ఆమె తల్లి కూడా వచ్చింది.. తాజాగా ఊహించని విధంగా నటి పవిత్ర గౌడ తన తల్లితో దర్శన్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.
పవిత్రను దూరం పెడుతున్న దర్శన్..
రేణుకా స్వామి హత్య కేసులో ఏ వన్ నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడను చూసేందుకు ఆమె తల్లి అగ్రహార జైలుకు వెళ్ళింది.. పవిత్ర గౌడ తల్లి.. తన చిన్న కొడుకుతో ఉదయం జైలుకు వెళ్ళగా.. పవిత్ర గౌడ తన తల్లితో కొన్ని గంటల పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంతలోనే పవిత్ర కూడా తన తల్లికి కష్టాలు చెప్పుకొని కన్నీరు మున్నీరు గా విలపించినట్లు సమాచారం. దర్శన్ కూడా పవిత్ర తో మాట్లాడలేదట. పవిత్ర కూడా అదే బాధలో ఉందని చెబుతున్నారు.. ఇక ఈ హత్య కేసులో నటుడు దర్శన్ దూరం పాటించడం పై పవిత్ర గౌడ తన తల్లికి చెప్పుకొని కన్నీరు మున్నీరు అయిందట..
తల్లి దగ్గర గోడు వెళ్ళగక్కిన పవిత్ర..
నేను ఏం చేశాను..? రేణుకా స్వామికి చెడ్డ సందేశం ఇచ్చానని.. అసలు నేను చేసిన తప్పేంటి..? అంటూ పవిత్ర గౌడ కన్నీటి పర్యంతం అయింది.. దర్శన్ కూడా తనదే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.. నా కొడుకుతో ఆడుకుంటున్నా అంటూ కూతురు గురించి తెలుసుకుంటూ పవిత్ర ఏడుస్తోంది.. అలాగే జైల్లో ఉండి అలసిపోయిన పవిత్ర కూడా జైల్లో భోజనం అక్కడ పరిస్థితులపై తన బాధను వెళ్ళగక్కినట్లు సమాచారం. అలాగే గృహోపకరణాలు వినియోగించుకునేందుకు కోర్టును ఆశ్రయించి రిప్ పిటిషన్ వేయాలని పవిత్ర గౌడ తల్లికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కూడా నటుడు దర్శన్ ను చూసేందుకు జైలుకి వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దర్శన్ భార్య విజయలక్ష్మి కుమారుడు దర్శన్ తల్లి మీనా తూగుదీప్, వారి దినకర్ తూగుదీప్ తో కలసి పరప్ప అగ్రహారం ను సందర్శించారు.. ఇప్పుడు దర్శన్ సోదరి, బావ , సోదరి కొడుకు కూడా జైలుకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పవిత్ర తనను దూరం పెడుతున్నాడు అని తల్లితో చెప్పి భారీ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పాలి.