Darshan Case : జైల్‌లో దర్శన్‌కు రోగం… దయ, కరుణ లేకుండా షాక్ ఇచ్చిన కోర్టు

Darshan Case : అభిమానులను సెలబ్రెటీలు చాలా ప్రేమగా చూసుకుంటారు. కొంత మంది అయితే, అభిమానులే తమ దేవుళ్లు.. వాళ్లు లేకుంటే తామే లేము అని చెప్పుకుంటారు. కానీ, కన్నడ నటుడు దర్శన్ తన అభిమానిని అత్యంత క్రూరంగా చంపి, ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ నటుడికి జైలులో ఓ వ్యాధి వచ్చిందట. దీంతో తనకు కొన్ని సౌకర్యాలు కావాలని కర్ణాటక హై కోర్టులో పిటిషన్ వేశాడు.

జైల్ ఫుడ్ తనకు పడటం లేదని, దీంతో తాను చాలా వరకు బరువు తగ్గిపోయానని పిటిషన్ లో చెప్పుకొచ్చాడు. అలాగే ప్రస్తుతం డయేరియాతో కూడా బాధపడుతున్నారట. జైలు అధికారులు దర్శన్ కి ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుమానించారని కూడా దర్శన తన పిటిషన్ లో చెప్పాడు. వీటి నుంచి తనకు విముక్తి కలిగించేలా హై కోర్టు తీర్పు ఇవ్వాలని కోరాడు. ఇంటి ఫుడ్ తో పాటు కత్తీ, పరుపు, కొన్ని దుస్తులను కూడా ఇప్పించాలని కోరాడు.

అయితే దర్శన్ పిటిషన్ ను కర్ణాటక హై కోర్టు తిరస్కరించింది. జైల్ లో అందరు ఖైదీలకు ఉండే సౌకర్యాలే దర్శన్ కు ఉంటాయని దర్శన్ తరుపు న్యాయవాదికి కర్ణాటక హై కోర్టు స్పష్టం చేసింది. అభిమానిని హత్య చేసిన దర్శన్ కు స్పెషల్ క్యాటగిరి ఇవ్వలేమని, ఉన్న వాటినే వాడుకోవాలని సూచించింది. అయితే ఈ పిటిషన్ పై ఈ రోజు (11 జులై)న కూడా విచారణ జరగబోతుంది.

- Advertisement -
Darshan request to High Court to get facilities from home
Darshan request to High Court to get facilities from home

కాగా, దర్శన్ తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత క్రూరంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్ ప్రస్తుతం జ్యూడిషయల్ కస్టడీలో ఉన్నాడు. జూన్ 8న ఆర్ఆర్ నగర్ లో రేణుకా స్వామిని చిత్ర హింసలు చేసి దర్శన్ హత్య చేశాడు. తర్వాత జూన్ 9న సుమన హల్లిలోని ఓ మురిగి కాలువలో రేణుకా స్వామి డెడ్ బాడీ లభించిన విషయం తెలిసిందే. తర్వాత రేణుకా స్వామిని తానే అత్యంత క్రూరంగా చంపినట్టు దర్శన్ ఒప్పుకున్నాడు. తన ప్రియురాలు పవిత్రకు రేణుకా స్వామి అసభ్యకరమైన మెసెజ్ లు చేయడం వల్లే ఈ హత్య చేసినట్టు దర్శన్ చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు