Ram Charan Car.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక సారి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. ఇప్పటికే కార్ లు అంటే ఇష్టమన్న ఆయన.. మరొకసారి తన రేంజ్ ఏంటో నిరూపించారు.. వేలకోట్లకు అధిపతి అయిన రాంచరణ్ తాజాగా తన రేంజ్ కు తగ్గట్టుగా మరో రోల్స్ రాయిస్ కార్ ను కొనుగోలు చేశారు.
రోల్స్ రాయిస్ కార్ ను కొన్న చెర్రీ..
అసలు విషయంలోకెళితే.. తాజాగా ముంబైలో అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటుతున్న విషయం తెలిసిందే . ఇక ఈ వివాహ వేడుకకు పలువురు తారలు సతీసమేతంగా విచ్చేస్తున్నారు.. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్ళిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త కారులో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఇప్పటికే ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన ఇప్పుడు మరొకసారి ” రోల్స్ రాయిస్ స్ప్రెక్ట్రా ” కారును కొనుగోలు చేశారు. ఇది ఎలక్ట్రిక్ కారు కావడం గమనార్హం . ఇక దీని విలువ ఏకంగా రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం.. ఇండియాలో ఇది రెండో కారు…7.50 కోట్ల ఖరీదు ఇప్పటికే ఈయన తండ్రి చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో రోల్స్ రాయిస్ కొన్న మూడో వ్యక్తిగా చెర్రీ..
ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ కలిగి ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలు ఇద్దరే ఇద్దరు.. అందులో చిరంజీవి, ప్రభాస్ మాత్రమే… ఇప్పుడు రోల్స్ రాయిస్ కొన్న మూడవ వ్యక్తిగా రాంచరణ్ నిలిచారు. ఇక ఈ ముగ్గురు కొనుగోలు చేసిన కార్ ల మోడల్స్ , ధరల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి రోల్స్ రాయిస్ పాంటం కారణం కొనుగోలు చేయగా.. దీని విలువ అక్షరాల రూ .9-10 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రోల్స్ రాయిస్ పాంటమ్ కారును కొనుగోలు చేయగా.. దీని విలువ రూ.8 – 10 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ఇప్పుడు రామ్ చరణ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ స్పెక్టర్ విలువ రూ.7.5 కోట్లు.. ప్రస్తుతం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఖరీదైన కారును కొనుగోలు చేసిన సినీ సెలబ్రిటీలు ఈ ముగ్గురే కావడం గమనార్హం.
రామ్ చరణ్ సినిమాలు..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి డైరెక్షన్లో చేసి ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం గమనార్హం. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక పాత్రకి జోడి గా కీయారా, ఇంకొక పాత్రకు జోడిగా తెలుగు హీరోయిన్ అంజలి నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాంచరణ్ ఒకవైపు సినిమాలు, యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తూ.. ఇప్పుడు తనకు ఇష్టమైన వాహనాలను కూడా కొనుగోలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.