Actor : పారితోషికం ఇవ్వలేదని పచ్చి బూతులు… నిర్మాతపై విరుచుకుపడ్డ పాపులర్ యాక్టర్

Actor : సినిమా ఇండస్ట్రీలో రోజుకో వివాదం వెలుగులోకి వస్తోంది. ఇటీవల కాలంలో నిర్మాతలు తమకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఇటీవలే రకుల్ మామ అప్పుల చిట్టా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పాపులర్ యాక్టర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తనకు పారితోషకం ఇవ్వలేదంటూ ఓ నిర్మాతపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డాడు. ఏకంగా సోషల్ మీడియా ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మరి ఆ నటుడు, నిర్మాత ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

పారితోషికం ఇవ్వలేదని బండ బూతులు…

వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తమిళ్ లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు నటుడు బాలాజీ మురగదాస్. అయితే ఈ నటుడు తాజాగా ఓ సినిమాలో నటించినందుకు గాను జేఎస్కే సతీష్ కుమార్ అనే నిర్మాత తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో రిలీజ్ కానున్న ఫైర్ అనే సినిమాలో వర్క్ చేసినప్పటికీ, తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ రాలేదని సోషల్ మీడియా వేదికగా తన నిరాశను వ్యక్తం చేశాడు. అంతేకాదు సోషల్ మీడియాలో సదరు నిర్మాణ సంస్థను ట్యాగ్ చేసి మరీ చెప్పలేని భాషలో తిట్టేశాడు.

Exclusive! Bigg Boss Tamil fame Balaji Murugadoss' first film as a lead is a courtroom drama

- Advertisement -

నటుడు బాలాజీ మురగదాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రొడక్షన్ టీంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన పోస్ట్ లో నేను ఫైర్ అనే జేఎస్కే ఫిలిమ్ కార్పొరేషన్ నిర్మాణ సంస్థకు సంబంధించిన సినిమాలో నటించాను. అయితే ఆ చిత్ర నిర్మాత నాకు ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా చెల్లించలేదు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే… డ్యూడ్ f**k ఆఫ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఫైర్ అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ దాని నుంచి నేను సంతోషంగా బయటకు వస్తాను అని బాలాజీ చెప్పడం గమనార్హం. అయితే ఈ పోస్ట్ తర్వాత ఐ గేవ్ అప్ అంటూ మరో కామెంట్ చేశారు.

రెమ్యూనరేషన్ పేరుతో మోసం

మీడియా కథనాల ప్రకారం నిర్మాత జేఎస్కే సతీష్ కుమార్ ఫైర్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తగ్గ పారితోషిన్ని ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాతే బాలాజీ నటించడానికి కమిట్ అయ్యారు. కానీ తీరా నిర్మాత నుంచి తనకు రావాల్సిన పారితోషకం రాదని అర్థం చేసుకున్న బాలాజీ విసుగు చెంది ఎట్టకేలకు బహిరంగంగానే ఈ అంశంపై స్పందించారు. తాజాగా బాలాజీ మురుగదాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది.. ఫైర్ సినిమాలో బాలాజీ మురగదాస్ తో పాటు గాయత్రి షాన్, సాక్షి అగర్వాల్, రచిత మహాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఇక జేఎస్కే ఫిలిం కార్పొరేషన్ విషయానికొస్తే ఇదొక జాతీయ అవార్డును గెలుచుకున్న నిర్మాణ సంస్థ. దీనిని మేనేజ్ చేస్తున్న నిర్మాత సతీష్ కుమార్ తమిళగ అరసియల్ వీక్లీకి చీఫ్ ఎడిటర్, తమిళ మనీలా కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, అఖిల భారత తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షుడు. మరి నిర్మాతలు ఈ వివాదం పై ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు