AparnaVastarey PassesAway : ఈ మధ్య కాలంలో వెండితెరపై బుల్లితెరపై వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యనే కన్నడలో పవిత్ర ఆక్సిడెంట్ లో మరణించగా, తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టివి యాంకర్ నటిగా పేరు తెచ్చుకున్న ‘అపర్ణ వస్తారే’ గురువారం రాత్రి కన్నుమూశారు. కన్నడ లో మజా టాకీస్ షోలో వరలక్ష్మిగా మెప్పించిన అపర్ణ బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించారు. కానీ చిన్న వయసులోనే యాంకర్ అపర్ణ బనశంకరిలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఈమె 51 సంవత్సరాల వయసులోనే మృతి చెందగా, అపర్ణ కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం అందింది. దీనిపై చాలా రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా అపర్ణ క్యాన్సర్ 4వ దశలో ఉండగా, ఆమె మరణించిందన్న సమాచారాన్ని ఆమె భర్త నాగరాజు వస్తారే మీడియాకు తెలియచేసారు.
యాంకర్ గా నటిగా చెరగని ముద్ర..
కన్నడలో ముందుగా అపర్ణ వస్తారే రేడియో మరియు టెలివిజన్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ఆరంభించింది. పుట్టన్న ‘మసనాడ పువ్వు’తో కన్నడలో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ‘అచ్చగానాడ’ షో బాగా ఆడటంతో పేరు బుల్లితెరపై కన్నడ టెలివిజన్లో ప్రారంభ దశలో ప్రోగ్రామ్లు ఇచ్చేవారు. 90వ దశకంలో చందన్ ఛానెల్లో అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అపర్ణ రేడియో జాకీగా కూడా పనిచేసారు. ఏకంగా వెయ్యికి పైగా టీవీ షోలు చేసిన ఈమె ప్రముఖ సీరియల్ ‘ముక్త’ లో షీలా ప్రసాద్ పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆమె కాలమిస్ట్ గా కూడా ప్రాచుర్యం పొందింది. ఆమె యువ ఆర్కిటెక్ట్ మరియు కవి నాగరాజా వస్తారేని వివాహం చేసుకుంది. అంతే కాదు 2013లో బిగ్ బాస్ కన్నడ మొదటి సీజన్లో అపర్ణ పాల్గొంది.
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..
ఇక బెంగుళూరు మెట్రో స్టేషన్ లో వినిపించే ట్రైన్ అనౌన్స్ మెంట్ గొంతు ఈమెదే అని చాలా మందికి తెలీదు. ఇక నటి అపర్ణ వస్తారే మరణవార్త (AparnaVastarey PassesAway) విని పలువురు సంతాపం ప్రకటించారు. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రముఖ కన్నడ ఛానెళ్ల కార్యక్రమాల్లో కన్నడ భాషలో ఎంతో చక్కగా, హుందాగా ప్రెజెంట్ చేస్తూ కన్నడ నాట మంచి పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆత్మకు శాంతి కలగాలని కర్ణాటక మంత్రులు విచారం వ్యక్తం చేసారు. అలాగే తోటి నటీనటులు అపర్ణ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.