Lavanya: మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.. పవన్ కళ్యాణ్ నే దిక్కు – లావణ్య..!

Lavanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ – లావణ్య కేసు మరో కొత్త మలుపు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అని మీడియా ముందుకు వచ్చిన లావణ్య ఆ తర్వాత తనను రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నాడని.. 11 ఏళ్ల ప్రేమ వివాహం బోరు కొట్టిందని ప్రముఖ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉండి.. తనను దూరం పెట్టాడు అంటూ సోషల్ మీడియా ముందు బట్ట బయలు చేసింది రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు రాజ్ తరుణ్ ను విడిచిపెట్టకపోతే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది..

Lavanya: Married three times.. Pawan Kalyan Ne Dikku - Lavanya..!
Lavanya: Married three times.. Pawan Kalyan Ne Dikku – Lavanya..!

ఇంకొకరితో ఎఫైర్.. అందుకే బ్రేకప్..

అయితే అదే రోజు రాజ్ తరుణ్ స్పందిస్తూ.. లావణ్యతో రిలేషన్ లో ఉన్నది నిజమే కానీ ఆమె ఇంకో వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది.. పైగా డ్రగ్స్ కేసులో 45 రోజులపాటు కూడా ఉంది.. అందుకే మూడు సంవత్సరాలుగా నేను ఆమెకు దూరంగా ఉన్నాను అంటూ రాజ్ తరుణ్ తెలిపారు.. అయితే ఇక్కడ మాల్వి మల్హోత్రా కూడా స్పందిస్తూ నా సామిరంగా సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే నేను రాజ్ తరుణ్ తో మాట్లాడాను… అతనితో నాకు ఎటువంటి రిలేషన్ లేదు.. నా పరువుకి భంగం కలిగిస్తోంది ..లావణ్య పై చర్యలు తీసుకోవాలని ఆమె కూడా పోలీసులను ఆశ్రయించింది. అలాగే అక్కడితో ఆగకుండా లావణ్య ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ తో పాటు హీరోయిన్ రిద్ది కుమార్ తో రాజ్ తరుణ్ కి రిలేషన్ ఉందంటూ హాట్ బాంబ్ పేల్చింది.. దీనితో నార్సింగి పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టాలని నోటీసులు జారీ చేశారు..

ఎఫ్ఐఆర్ లో విస్తుపోయే నిజాలు..

ఇక తాజాగా ఆధారాలను తీసుకొచ్చిన లావణ్య.. తనకు రెండు నెలల గర్భాన్ని అబార్షన్ చేయించాడని.. అందుకు హాస్పిటల్ బిల్లు కూడా రాజ్ తరుణ్ పే చేశాడని.. తాము ప్రేమించుకుంటున్నామని ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు కూడా రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేశారని.. ఏకంగా రూ .70 లక్షల వరకు అతడికి సొంత డబ్బు ఇచ్చాను అంటూ ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచింది. రాజ్ తరుణ్ కుక్కల వల్ల ఏకంగా ఆరు ఇల్లు మారమని చెప్పిన ఆమె.. యూఎస్ నుంచి ఇండియా వచ్చినప్పుడు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో డ్రగ్ కేసులో ఇరికించి 45 రోజులు రిమాండ్ లో ఉండేలాగా చేశారు అంటూ తెలిపింది.. వీటన్నింటినీ కూడా తన ఎఫ్ఐఆర్ కాపీలో పంచుకున్న లావణ్య ఇప్పుడు తనకు న్యాయం జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాల్సిందే అని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

- Advertisement -

ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ..

తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె నాకు న్యాయం జరగాలి అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాలి.. అయితే ఆయన కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు.. కానీ రాజ్ తరుణ్ లాగా చేయలేదు.. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా గౌరవం.. అందుకే రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి మోసం చేసి పారిపోయాడనే విషయాన్ని నేను ఆయనతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు… కానీ భార్యలను బాధ్యతగా చూసుకున్నారు. రాజ్ నాకు కనీసం తినడానికి కూడా తిండికి డబ్బులు ఇవ్వట్లేదు అంటూ వాపోయింది లావణ్య .మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి న్యాయం కోసం వెళుతున్న ఈమెకు ఏ మేరకు న్యాయం లభిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు