Puri Jagannadh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి అనే ఒక సినిమాను చేసి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా సెటిలైపోయాడు. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా చేసిన బాజీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రవితేజ హీరోగా ఎన్నో సినిమాలను చేసి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో చూపించాడు పూరీ జగన్నాథ్.
మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. అలానే అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్. రామ్ చరణ్ తేజ్ ను చిరుత అనే సినిమాతో లాంచ్ చేసింది కూడా పూరి. పూరి మేకింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలు తో ప్రూవ్ అవుతూ వస్తుంది. కథను త్వరగా రాసేసి, అంతే త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడం పూరీకి అలవాటు. ఇక రీసెంట్ టైమ్స్ లో పూరి హిట్ సినిమా చూసి చాలా రోజులైంది అని చెప్పాలి.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నిన్న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా పూరీ జగన్నాథ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మణిశర్మ గారు నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తారు. ఇంక మిమ్మల్ని అందరిని నాకు కలవాలని ఉంది ఒకరోజు పెద్దమ్మ గుడిలో లంచ్ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు పూరి.
A special message from the very special man 🤩
Dance to the ‘Mass Song Of The Year’, #SteppaMaar and the best performers will have a Lunch Meet with #PuriJagannadh ❤️🔥
Start Reeling now 🕺💃
▶️https://t.co/9Uh7r5CJvb#DoubleISMART #DoubleIsmartOnAug15Ustaad @ramsayz pic.twitter.com/ChIyoy4Yq8
— Puri Connects (@PuriConnects) July 11, 2024