Anant Ambani Wedding : ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ రాధిక మచ్చంట ల పెళ్ళికి సంబంధించిన చర్చే జరుగుతుంది. దేశంలోనే అత్యంత కాస్ట్లీ పెళ్లిగా జరుగుతున్న అనంత్ అంబానీ వెడ్డింగ్ కి సెలబ్రిటీలలో ఎవరెవరు హాజరవుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ పెళ్లి వేడుకలో కరోనా కలకలం మొదలైంది. కరోనా కారణంగా ఓ స్టార్ హీరో అనంత్ అంబానీ వెడ్డింగ్ ను స్కిప్ చేసినట్టుగా సమాచారం. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అంబానీ పెళ్ళిని స్కిప్ చేస్తున్న స్టార్ హీరో…
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆనంద అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లికి ఇన్విటేషన్ అందిన స్టార్స్ ఎవరెవరు, ఎంత మంది హాజరవుతున్నారు? ఎంత మంది ఎస్కేప్ అవుతున్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ హై ప్రోఫైల్ వెడ్డింగ్ ను స్కిప్ చేయబోతున్నట్టుగా సమాచారం. నిజానికి ఇలాంటి పెళ్లిలో పాల్గొనడం అనేది అత్యంత అరుదైన అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? కానీ ఈ స్టార్ హీరో మాత్రం పెళ్లికి దూరంగా ఉండబోతున్నాడని సమాచారం. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే అక్షయ్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని వారాలుగా తన కొత్త చిత్రం సర్ఫిరా ప్రమోషన్లలో ఆయన బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా చాలామంది వ్యక్తులతో కలిసి తిరగడం, మాట్లాడడం లాంటివి చేయాల్సి వస్తుంది.
అయితే ముంబైకి వచ్చిన తర్వాత అక్షయ్ కుమార్ టెస్ట్ చేయించుకోగా రిజల్ట్స్ లో కరోనా ఉన్నట్టుగా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం ఒంటరిగా తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాడు. అలాగే వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా సర్ఫిరా కోసం పోస్టు రిలీజ్ ప్రమోషన్లను కూడా ఆయన స్కిప్ చేస్తున్నట్టుగా సమాచారం.
మళ్లీ మొదలైన కరోనా కలకలం
కోవిడ్ 19 అనే ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఇప్పటికే రెండు వేవ్ లతో దేశాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా కరోనా ఇంకా ఉంది అనడానికి తాజాగా అక్షయ్ కుమార్ దాని బారిన పడడమే నిదర్శనం. ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలవడంతో వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. కరోనా కేసులు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా జూలై 12న సర్ఫిరా మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తమిళ సినిమా సూరారై పొట్రుకు హిందీ రీమేక్ సర్ఫిరా. ఒరిజినల్ వెర్షన్ తో పాటు హిందీ రీమేక్ కి కూడా సుధా కొంగరే దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. అలాగే ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో నటించారు. సినిమాకు హిందీలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.