Rashmi Gautham : అడల్ట్స్ లాగా రేప్ చేశారు కాబట్టి ఆ శిక్ష పడాల్సిందే… పవన్ కళ్యాణ్ కు రష్మీ డిమాండ్

Rashmi Gautham : హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. మూగ జీవాలపై తలెత్తే సమస్యలపై మాట్లాడడమే కాకుండా వాటిపై ఎవరైనా చేయి ఎత్తితే అస్సలు ఊరుకోదు. అలాగే పలు సామాజిక అంశాలపై, సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ, కుండ బద్దలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. తాజాగా ఏపీలో జరిగిన రేప్ ఘటనపై రష్మీ పవన్ కళ్యాణ్ కు షాకింగ్ డిమాండ్ చేసింది.

వివాదం ఏంటంటే…

ఏపీలోని నంద్యాల జిల్లాలో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన రేప్ ఘటన కన్నీళ్లు పెట్టించింది. ఆడుకుంటానని బయటకు వెళ్లిన ఆ చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేయడం అందరి మనసులను కదిలించింది. ఎంతో సంతోషంగా ఆడుకోవడానికి బయటకు వెళ్ళిన ఆ చిన్నారి ముగ్గురు కీచకుల అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. నంద్యాల జిల్లా మండలం మచ్చుమరిలో సుజాత, మద్దిలేటి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. రెండవ కూతురు తాజాగా ఈ ఘటనకు బలైంది. ఆమె ఐదవ తరగతి చదువుతోంది. అయితే ఆదివారం రోజు స్కూల్ కు సెలవు ఉండడంతో ఉదయాన్నే ఆడుకుంటానని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్ళింది.

కానీ మధ్యాహ్నం ఆలస్యమైనప్పటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. అయినప్పటికీ కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు మైనర్ అబ్బాయిలపై అనుమానం వ్యక్తం చేస్తూ తమదైన స్టైల్ లో విచారించగా షాకింగ్ విషయం తెలిసింది. ఆ ముగ్గురిలో ఒకడు పాపపై అత్యాచారం చేసి, అనంతరం మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసామని ఒప్పుకున్నాడు. దీంతో ఆ తర్వాత అసలు విషయం బయటకు రాగా పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన ముగ్గురు అబ్బాయిలు కూడా 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. అయితే సాధారణంగా మైనర్లకు పెద్దగా శిక్షలు వేయరన్న విషయం తెలిసిందే. కానీ రాను రాను పరిస్థితి చూస్తుంటే ఇదే వాళ్లకు అలుసుగా మారినట్టుగా అనిపిస్తోంది. అందుకే ఇంత పెద్ద తప్పు చేసిన మైనర్లను చిన్న చిన్న శిక్షలతో వదిలేయొద్దు అంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు పలువురు. అందులో రష్మీ గౌతమ్ కూడా చేరింది.

- Advertisement -

jabardasth anchor rashmi gautam real age you will get shocked ksr

రేప్ ఘటనపై రష్మీ రియాక్షన్…

యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తున్న చిన్నారి రేప్ ఘటనపై స్పందించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా వాళ్ళను వదలొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు పెద్ద వాళ్లలాగా రేప్ చేశారు కాబట్టి పెద్దవాళ్లలాగే శిక్షించాలి అని, చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాప పడట్లేదు కాబట్టి మైనర్లు పేరుతో వాళ్లకు తక్కువ శిక్ష పడడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా వేదికగా రాస్కొచ్చింది రష్మీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు