MythriMovieMakers : ఇచ్చి పుచ్చుకోవడం బాగానే ఫాలో అవుతున్న మైత్రి..

MythriMovieMakers : టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులన్నీ వీళ్ళ బ్యానర్ లోనే రాబోతున్నాయి. ఈ బ్యానర్ లో వచ్చిన బడా చిత్రాలన్నీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని రికార్డులు క్రియేట్ చేసాయి. శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో భారీ లాభాలను కూడా వెనకేసుకున్నారు. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి కలిసి ఈ నిర్మాణ సంస్థ స్థాపించగా, కెరీర్ మొదటి నుండి మంచి విజయాలు సాధిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు తో మొదలైన వీరి విజయ ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. పెద్ద సినిమాలే కాదు.. ఉప్పెన వంటి చిన్న సినిమాలతో కూడా పెద్ద సక్సెస్ లు సాధించి సూపర్ హిట్లను అందుకున్న మైత్రి మూవీస్ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లు గానూ రానిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా బడా మూవీస్ ని భారీ రేట్లకు కొని భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

Thalapathy Vijay 'Goat' Movie Rights Got by MythriMovieMakers

ఇచ్చిపుచ్చుకోవడం ఫాలో అవుతున్న మైత్రి వారు..

ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా రానిస్తున్నారు. ఇతర భాషల్లో పాన్ క్రేజీ ప్రాజెక్టులని రిలీజ్ చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. రీసెంట్ గా మంజుమ్మేల్ బాయ్స్ సినిమాతో మంచి లాభాలు అందుకున్న ఈ సంస్థ, వరుసగా ఇతర భాషల స్టార్ హీరోల సినిమాలను దక్కించుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా దళపతి విజయ్ నటిస్తున్న ‘గోట్’ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే గోట్ సినిమాని నిర్మిస్తున్న AGS ఎంటర్టైన్మెంట్స్ వారికి పుష్ప ది రూల్ తమిళ హక్కులను భారీ రేటుకు అమ్మడం జరిగింది. దీంతో సినిమాల రేటు అటు ఇటు ఉన్నా, తమకు సినిమా ఇచ్చినందుకు, వారికి మరో సినిమా ఇస్తూ ‘ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయాన్ని బాగానే పాటించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

పాన్ ఇండియా ప్రాజెక్టులు మైత్రి చేతిలో…

ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు, అలాగే ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రాలు చాలా వరకు మైత్రి మూవీ మేకర్స్ చేతిలోనే ఉండడం విశేషం. త్వరలో రిలీజ్ కాబోతున్న పుష్ప ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో పాటు, భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న RC16, ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ, ఎన్టీఆర్ 31, సన్నీ డియోల్ సినిమాలు మైత్రి బ్యానర్ లోనే రూపొందనున్నాయి. మరి రాబోయే రోజుల్లో మైత్రి ప్రస్థానం ఎదుగుతుందో చూడాలి. ఇకపోతే ఈ ఏడాది మైత్రి నిర్మించిన పుష్ప ది రూల్ విడుదల పైనే అందరి ఆసక్తి నెలకొని ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు