Raj Tarun Controversy : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఆల్మోస్ట్ సినిమా స్టైల్ లో రోజుకో ఇంటరెస్టింగ్ వార్తతో ఈ వివాదం రోజురోజుకూ పెద్దదవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి షాక్ మీద షాక్ ఇస్తున్న లావణ్య తాజాగా నిరాహార దీక్షకు రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.
రాజ్ తరుణ్ కోసం లావణ్య నిరాహార దీక్ష
తాజా సమాచారం ప్రకారం లావణ్య తనకు రాజ్ తరుణ్ కావాలంటూ, అతని కోసం ఏకంగా నిరాహార దీక్ష చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తను డ్రగ్స్ తీసుకున్నాననే విషయాన్ని సాకుగా చూపి రాజ్ తరుణ్ దూరం పెట్టాడని, కానీ అదంతా అబద్దామని చెప్పిన ఆయన మాజీ ప్రేయసి లావణ్య వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మాధవి మల్హోత్రా పై కంప్లైంట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. లావణ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాజ్, మాల్వి మల్హోత్రాపై పోలీసులను ఫిర్యాదు చేశానని గుర్తు చేస్తూ ఆధారాలన్నీ సమర్పించినప్పటికీ పోలీసులు ఈ వ్యవహారంపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా 5 కోట్లు ఆశగా చూపి కేసును వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ బాధతోనే తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. అయితే ఏదేమైనా సరే తనకు రాజ్ కావాలి అంటూ అతడి కోసం నిరాహార దీక్షకు రెడీ అనే షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
అతడి మెసేజ్ వల్లే ఆత్మహత్య ప్రయత్నం
ప్రేమ పేరుతో 11 ఏళ్ల పాటు తనతో కలిసి ఉండి, ఇప్పుడు మరో అమ్మాయి కోసం మోసం చేశాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత అబార్షన్ చేయించాడని ఆరోపించిన లావణ్య దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు కూడా అందించింది. అయితే అంతలోనే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించి సంచలనం సృష్టించింది.
తన తరపు న్యాయవాది దిలీప్ సుంకరకు మెసేజ్ పెట్టి మరీ సూసైడ్ కు ప్రయత్నం చేయగా, ఆయన పోలీసులు సహాయంతో లవన్యను కాపాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ తో తనకు గొడవ పడే ఉద్దేశం లేదని, అతను తప్పు చేశాడనే విషయాన్ని తాను ఎక్కడా చెప్పలేదని వివరించింది. ఇదంతా తను రాజ్ తరుణ్ కోసమే చేస్తున్నానని అతనిపై తన ప్రేమను వ్యక్తం చేసింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ కోసం ఎంతదాకా అయినా వెళ్తాను అంటూనే రాజేష్ అనే అడ్వకేట్ నిన్న రాత్రి కేసు నిలబడదు అని మెసేజ్ పెట్టాడని, అతను ఎవరో కూడా తనకు తెలియదని, అతని వల్లే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది.