Rajendra Prasad.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఇప్పటికీ హీరో, హీరోయిన్లకి తండ్రిగా, మామగా పలు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈయన హీరో, కమెడియన్ మాత్రమే కాదు డైరెక్టర్ , నిర్మాతగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. దాదాపు 200కు పైగా సినిమాలలో హీరోగా నటించిన రాజేంద్రప్రసాద్ ఎక్కువగా తన సినిమాలు కామెడీ లోనే ఉండేవి.. అందుకే కామెడీ సినిమాలకు ఈయనను పెట్టింది పేరుగా పిలిచేవారు అభిమానులు.
రాజేంద్రప్రసాద్ పై అలాంటి నింద..
ముఖ్యంగా గొడవలకు పోకుండా ఎప్పుడూ శాంత స్వభావంతో కనిపించే రాజేంద్ర ప్రసాద్ పై కూడా ఒక రూమర్ వినిపిస్తూ ఉంటుంది.. అదేమిటంటే ఇండస్ట్రీలో తనతో నటించే ప్రతి హీరోయిన్ తో కూడా మిస్ బిహేవ్ చేస్తారు అనే రూమర్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.. అంతేకాదు ఈ రూమర్ కి తగ్గట్టుగానే ఒక హీరోయిన్ కూడా మీటూ ఉద్యమంలో రాజేంద్ర ప్రసాద్ పై సంచలన కామెంట్లు చేయడంతో ఆ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాదు రాజేంద్రప్రసాద్ చేసిన ఒక పని వల్ల ఆమె భయపడిపోయి ఇండస్ట్రీకి దూరమైందని సమాచారం. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏమిటా విషయం ? అనేది ఇప్పుడు చూద్దాం.
బలవంతం చేశాడు అంటున్న మాళవిక..
రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన చిత్రాలలో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా కూడా ఒకటి.. ఇందులో హీరోయిన్ గా మాళవిక నటించగా.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా.. అయితే ఈ హీరోయిన్ రాజేంద్రప్రసాద్ పై అణుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ తనతో అలాంటి పని చేయాలని బలవంతం చేశారట.. ఈ విషయంపై ఆమె మీటూ ఉద్యమంలో బలంగా వినిపించింది. అయితే ఆ సమయంలో ఈమెకు విమర్శలు ఎదురయ్యాయి.. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ హీరోయిన్ అంటే కేవలం అలాంటి పనుల కోసమే అని చూసేవారని..అందుకే ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమెదే తప్పు అన్నట్లు మాట్లాడారు..
రాజేంద్రప్రసాద్ దెబ్బకు ఇండస్ట్రీకి దూరం..
అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలో బలవంతంగా ఆమెను గట్టిగా పట్టుకొని లిప్ కిస్ చేశాడని కూడా ఆరోపించింది మాళవిక. పైగా రాజేంద్రప్రసాద్ అప్పటికే స్టార్ హోదా అనుభవిస్తున్నారు. అలాంటి ఈయనపై ఆమె ఇలాంటి కామెంట్ చేయడంతో అందరూ ఈమెనే మందలించారు.. అయితే ఆమె తట్టుకోలేక సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోదామని అనుకోగా.. సినిమా పెద్దలు ఆమెకు మార్నింగ్ ఇచ్చి షూటింగ్ పూర్తి చేశారట.. ఇక దాంతో భయపడిపోయిన మాళవిక మళ్ళీ సినిమాలలో కనిపించలేదు. మరి మాళవిక ఎంత భయపడిపోయిందో ఏమో కానీ రాజేంద్రప్రసాద్ దెబ్బకు ఇండస్ట్రీ నుంచి దూరమైందని సమాచారం.. రాజేంద్ర ప్రసాద్ మాత్రమే తగ్గించుకో ఇటు ఈ విషయంపై నోరు మెదపలేదు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.