OTT Movie : ప్రియుడి కోసం భర్తను చంపే మిల్కీ బ్యూటీ… ఈ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ ను ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు సీన్ సీన్ కో ట్విస్టుతో ఉతకంతభరితంగా సాగుతాయి. ఇక అందులో స్టార్ హీరోయిన్లు నటిస్తే చూడడానికి ఇంకా బాగుంటుంది. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఇలాంటి ఓ మూవీ సీక్వెల్ ఓటీటీలోకి రాబోతోంది. పైగా అందులో మిల్కీ బ్యూటీ నటించడం మరో విశేషం, మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

తాప్సీ పన్ను, విక్రాంత్ మస్సీ నటించిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ ఈరోజు అంటే జూలై 15న ప్రకటించింది. ఈ మూవీ ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ లో 2021లో రిలీజైన హసీన్ దిల్‌రుబా మూవీ ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రియుడి కోసం తన భర్తను తానే హత్య చేసిందని పోలీసులు అనుమానించే యువతి రాణి పాత్రను తాప్సీ పన్ను ఈ సినిమాలో పోషించింది. ఇప్పుడు మూవీకి సీక్వెల్ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా అనే టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాలో విక్రాంత్ మస్సీ రిషు పాత్రలో, సన్నీ కౌశల్ అభిమన్యుగా నటించారు. నెట్ ఫ్లిక్స్ ఫిబ్రవరి 29న ఈ సీక్వెల్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది.

Taapsee Is Back With Phir Aayi Haseen Dillruba | cinejosh.com

- Advertisement -

హసీన్ దిల్‌రుబా కథలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ పేరు రాణి. తన భర్తకు ఆమె అంటే చాలా ఇష్టం. అయితే అంతకంటే ముందే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ అతను ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో పెద్దలు కుదిర్చిన పెళ్లిని బలవంతంగా చేసుకుంటుంది. అంతేకాకుండా ఆమెకు భర్త అంటే ఇష్టమే అయినప్పటికీ కాపురం విషయంలో సంతోషంగా ఉండదు. అలాంటి టైమ్ లోనే దిగుతాడు హీరో కజిన్. హీరోతో పోలిస్తే అతను బాగా కండలు తిరిగిన దేహంతో, చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇంకేముంది అతని మాయలో పడిపోతుంది హీరోయిన్. అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దీంతో హీరో కజిన్ అక్కడి నుంచి పారిపోతాడు. అయితే విషయంలో తెలిసిన ఆమె భర్త హీరోయిన్ తో సైకోలా ప్రవర్తిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంట్లో ఓ పెద్ద పేలుడు జరుగుతుంది. దీంతో పోలీసులు హీరోయినే తన భర్తను చంపింది అనే అనుమానంతో కేసును విచారిస్తారు. అయితే పోలీసులు ఆమె భర్తను హత్య చేసిందన్న విషయాన్ని నిరూపించలేకపోతారు. చివరకు ఆమె భర్త తిరిగి, రాగా ఇద్దరూ కలిసి తమను బ్లాక్ మెయిల్ చేసిన హీరో కజిన్ ను ఎలా చంపారో చూపిస్తారు. చివరకు భార్యభర్తలు హ్యాపీ ఎండింగ్. అయితే ఇప్పుడు సీక్వెల్ లో ఏం ప్లాన్ చేశారో చూడాలంటే ఆగస్ట్ 9 దాకా వెయిట్ అండ్ సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు