Raj Tarun Controversy: తెరపైకి మరో కొత్త కథ… మాల్విపై హత్యాయత్నం చేసిన ఎక్స్ లవర్

Raj Tarun Controversy : రాజ్ తరుణ్ వివాదం రేపిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. అయితే ఈ వివాదంలో బయటకు వచ్చిన ఇంట్రెస్టింగ్ పేరు మాల్వి మల్హోత్రా. ఇదివరకు ఈ బ్యూటీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ లావణ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాల్వి మల్హోత్రా పేరే వినిపిస్తోంది. ఈ మేరకు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఇద్దరిపై కేసులు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మాల్వి మల్హోత్రా గత జీవితం గురించి తవ్వితీస్తున్నారు నెటిజన్లు. అందులో భాగంగానే ఈ బ్యూటీపై గతంలో చావు అంచులదాకా వెళ్ళి తిరిగొచ్చింది అన్న షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. మరి మాల్వీ మల్హోత్రాను అతను ఎందుకు చంపాలి అనుకున్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే…

మాల్వి మల్హోత్రాపై ఎక్స్ లవర్ దాడి

నిజానికి మాల్వి మల్హోత్రా ఇంకా ఫామ్ లోకి రాలేదు కాబట్టి ఆమె పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఈ వివాదం నేపథ్యంలో ఆమె గతంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్బుక్ ద్వారా యోగేష్ ను కలిసింది మాల్వి. ఆ తర్వాత 2020 అక్టోబర్ లో ముంబైలోని అంధేరిలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో యోగేష్ మహీపాల్ సింగ్ ఏకంగా కత్తితో మాల్విపై దాడి చేశాడని సమాచారం. ఈ దాడిలో మాధవి గాయపడగా, వేలికి ఆపరేషన్ కూడా జరిగింది. అయితే యోగేష్ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్టు కాగా, ఇప్పుడు యోగేష్ తల్లి మాల్విపై కేసు పెట్టింది. ప్రేమ పేరుతో తన కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసి, ఆస్తులు కాజేసి జైలు పాలు చేసిందని మాల్విపై యోగేష్ తల్లి కంప్లైంట్ చేసింది. యోగేష్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, ఆమె నిరాకరించడంతోనే అతను ఈ దాడిని పాల్పడ్డట్టుగా సమాచారం.

Malvi Malhotra: రాజ్ తరుణ్‏తో ప్రేమాయణం.. లావణ్య ఆరోపణలపై స్పందించిన  హీరోయిన్..

- Advertisement -

రాజ్ తరుణ్ తో ఎఫైర్…

మాల్వి మల్హోత్రా టాలీవుడ్లో హీరోయిన్ గా నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజ్ తరుణ్ తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య ఈ యంగ్ హీరో మాధవి మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ కేసు పెట్టింది. అంతేకాకుండా గుడిలో తామద్దరికీ రహస్య వివాహం జరిగిందని, తరుణ్ తనుకు రెండుసార్లు అబార్షన్ చేయించాడంటూ ఆధారాలు కూడా లావణ్య పోలీసులకు సమర్పించింది. అందులో మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ గురించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా లావణ్య కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వి మల్హోత్రా, ఏ3గా ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను చేర్చారు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి కూడా నోటీసులు జారీ చేశారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు