Bollywood Heroine.. బాలీవుడ్ సినీ పరిశ్రమ అనగానే ఎక్కువగా దీపిక పదుకొనే , అలియా భట్ లాంటి హీరోయిన్స్ గుర్తుకొస్తారు.. అయితే వీరంతా భారీగా క్రేజ్ దక్కించుకున్నారు.. కానీ హీరోలకు మించి పారితోషకం అయితే తీసుకోవడం లేదు అని చెప్పాలి.. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం అత్యధిక పారితోషకం తీసుకోవడమే కాదు హీరోల పారితోషకాలను కూడా బీట్ చేస్తూ ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు తీసుకుంటూ రికార్డు సృష్టిస్తోంది. ఈ మధ్యకాలంలో వెంకటేష్ , బాలకృష్ణ , చిరంజీవి లాంటి హీరోలు కూడా ఈ తరహాలో పారితోషకాలు తీసుకోవడం లేదు అనడంలో సందేహం లేదు.
స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం..
ఒక హీరోయిన్ అయిండి ..అందులోనూ ఈ సీనియర్ స్టార్ హీరోలకి ధీటుగా పారితోషకం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.
రూ.కోటి పారితోషకం అనే అడ్డంకిని తొలగించిన ఈ ముద్దుగుమ్మ.. తన చేతుల మీదుగా బాలీటౌన్ లో నటీమణుల పారితోషకం పెంచే ప్రక్రియ ప్రారంభమైంది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా ఈమె విజయవంతంగా పనిచేసి.. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. నివేదిక ప్రకారం దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు రూ.40కోట్లు అందుకుంటుంది.. అయితే ఈ సంఖ్య హాలీవుడ్ కి సంబంధించింది. రూ.40 కోట్లు అంటే అక్కడ 5 మిలియన్ డాలర్లు. ఇటీవల ఈమె నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ .40 కోట్లు పారితోషకం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్..
అయితే ఇండియాలో కూడా ఈమె అత్యధిక పారితోషకం అందుకుంటుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు రూ.15 నుండి రూ.25 కోట్ల వరకు సంపాదిస్తుందని సమాచారం. 2010 వరకు బాలీవుడ్ లో దూసుకుపోయిన ఈమె బాజీరావు మస్తానీ, దిల్ ధడక్ నే దో , బర్ఫీ, మేరీ కోమ్ వంటి చిత్రాలలో నటించి భారీ విజయాలను అందుకుంది.. అయితే ఆ తర్వాత బాలీవుడ్ వదిలి హాలీవుడ్ వెళ్ళిపోయిన ఈమె.. ఇక్కడ సినిమాలను తగ్గించి.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.
బాలీవుడ్ లో తొక్కేశారు..
అంతేకాదు ఈమె విజయాన్ని ఓర్వలేక బాలీవుడ్లో కొంతమంది తనను కావాలని తొక్కేసారని, అందుకే అవకాశాలు ఇవ్వడం లేదని ఒకానొక సమయంలో మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికైతే బాలీవుడ్ లో అవకాశాలు రాకపోయేసరికి హాలీవుడ్లో సత్తా చాటుతూ ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా..
ప్రియాంక తర్వాత ఆస్థానం దీపికా దే..
ప్రియాంక చోప్రా తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా దీపికా పదుకొనే రికార్డు సృష్టించింది.. ఈమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ నెంబర్ ను ఇంకా బాలీవుడ్ హీరోయిన్ లు ఎవరు దాటలేదు… మరి భవిష్యత్తులోనైనా ఈ నంబర్ దాటే అవకాశం ఉందేమో చూడాలి.. ఏది ఏమైనా స్టార్ హీరోల రేంజ్ లో రూ.40 కోట్ల పారితోషకం అందుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది ఈ ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.
Lihat postingan ini di Instagram