Rambha – Thalapathy Vijay: టాలీవుడ్ ప్రముఖ నటి రంభ తాజాగా దళపతి విజయ్ ను కలిశారు.. తన కుటుంబంతో వెళ్లి కలవడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సడెన్ గా రంభ విజయ్ ను ఎందుకు కలిసింది .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. ఇప్పుడు రంభ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది..
ఒకప్పుడు తెలుగుతో పాటుగా పలు సినిమాల్లో నటించిన రంభ కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటుంది. తన ఫ్యామిలీ , పిల్లలను చూసుకుంటూ గడిపేస్తుంది. అయితే పెద్దగా మూవీ స్టార్స్ ను కలవని రంభ విజయ్ దళపతిని కలవడం పై గుసగుసలు పుట్టుకొసున్నాయి. వీరు కలిసిన ఫోటోలను రంభ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది..
రంభ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. విజయ్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు.. అందుకే ఇప్పుడు వీరిద్దరూ కలిశారా ? ఇంకేదైనా ఉందా ? అనేది తెలియాల్సి ఉంది.. ఇక వీరిద్దరూ 90 లో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ‘మిన్సార కన్నా’, ‘నినైతెన్ వందై’, ‘ఎంద్రెందుం కాదల్’ వంటి ప్రముఖ చిత్రాలలో వీరు స్క్రీన్ను పంచుకున్నారు. వారి “ఊదా ఊదా” మరియు “బాయ్ ఫ్రెండ్” వంటి పాటలు నేటికీ అభిమానులలో ఎంతో ఇష్టమైనవి. ఇప్పటికి ఆ పాటలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ది గోట్ మూవీలో నటిస్తున్నాడు.. ఇదే విజయ్ చివరి సినిమా.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
View this post on Instagram