Ram Gopal Varma : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదొక వార్తతో హైలెట్ అవుతుంటాడు. మొన్నటివరకు సినీ, రాజకీయ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు.. ఈ మధ్య దేశంకోసం పోరాడిన అమరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అందరి కోపానికి కారణం అవుతున్నాడు. వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు . అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు నిస్సంకోచంగా సమాధానాలు చెప్పాడు. అందులో మహాత్మ గాంధీ గురించి ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసాడు . ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది..
డైరెక్టర్ ఆర్జీవీ ముక్కుసూటి మనిషి .. ఏదైన మనసులో పెట్టుకోకుండా అనేస్తాడు అవతలి వాళ్ళనుంచి చివాట్లు తింటాడు. వర్మ రీసెంట్ గా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ యాంకర్ స్వాతంత్య్రం రావడడానికి మహాత్మ గాంధీ ఎంతో చేసాడు అని అడగ్గా.. వర్మ సమాధానం చెప్తూ .. గాంధీ వల్ల మనకు స్వాతంత్య్రం రాలేదు. ఆయన జనాలను మ్యానుపులేట్ చేసాడు.. ఐడి లేకుంటే ఎవరిని నమ్మొద్దని చెప్పాడు. నేను హింసను చెయ్యను , ఎదురిస్తాను.. అహింసను ఫాలోఅవుతాను అని చెప్పాడు. అందుకే జనాలు ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారని వర్మ అన్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుద్దిలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.
ఇక ఆర్జీవీ సినిమాల విషయానికొస్తే.. 2019 ఎన్నికలకు ముందు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదాలను మూటకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాడు . బోల్డ్ కంటెంట్ తో వచ్చాయి.. ఆ సినిమాలు థియేటర్లలో ఎక్కువ రోజు ఆడలేదు. ఆ మధ్య రాజకీయ నాయకుల బయోపిక్ తీస్తానని కొన్ని సినిమాలను ప్రకటించినప్పటికీ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. మొన్నామధ్య డేంజరస్ సినిమాను చేసాడు. ఆ సినిమా విడుదలను అడ్డుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే ప్రస్తుతం ఈయన సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.