Tamannaah.. మిల్క్ బ్యూటీ తమన్నా ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా దూసుకుపోతోంది. ఇటీవలే అరుణ్మనై 4 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె పలు చిత్రాలలో ఐటెమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలతోనే కాదు వారి వారసులతో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దగుమ్మ.. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో తమన్నా డాన్స్ గురించి కోలీవుడ్ సీనియర్ నటుడు పార్తీబన్ ఆసక్తికర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
తమన్నా పై అలాంటి కామెంట్లు చేసిన పార్తీబన్..
తమన్నా డాన్స్ ఉంటే చాలు సినిమాలో కథ లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో పార్తీబన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా ఈయన మాటలను కొంతమంది నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాదు తమన్నాను ఉద్దేశించి ఎందుకు అలా అన్నారో..? ముఖ్యంగా ఏ సినిమా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్లు చేశారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉండగా తాజాగా ఈ మాటలపై పార్తీబన్ స్పందించారు.
తమన్నాకు క్షమాపణలు..
ఆయన మాట్లాడుతూ.. తమన్నాకు క్షమాపణలు కూడా చెప్పారు.. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరి పైన తనకు గౌరవం ఉందని, ఏ రోజు కూడా నటీనటులను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం తనకు లేదని, తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కూడా కోరారు. మొత్తానికైతే తమన్నాపై చేసిన కామెంట్లకు తమన్నాకి కూడా క్షమాపణలు చెప్పారు పార్తిబన్
అసలు ఏమి జరిగింది..?
పార్తీబన్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ చిత్రాలలో కీలకపాత్రలు పోషించే ఈయన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు.. అలాగే తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో కనిపించారు. ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిలిం టిన్జ్.. జూలై 12వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఈయన.. కొన్ని సినిమాలు అలాగే తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినీ ప్రేక్షకులకు సినిమాలో కథ ఉందా లేదా అనేది పట్టించుకోరు. హీరోయిన్ డాన్స్ కోసమే చూస్తున్నారు. ముఖ్యంగా తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేశారు.
నెటిజన్స్ కామెంట్స్ వైరల్..
దీంతో పార్తీబన్ జైలర్ లేదా బాక్ చిత్రాలను ఉద్దేశించి ఈ వాక్యాలు చేశారని నెటిజన్లు భావించారు.. అందుకే ఆయన తీరుపై మండిపడ్డారు. ఇక ఎట్టకేలకు స్పందించిన పార్థీబన్ క్షమాపణలు చెప్పారు. ఇక ఇది చూసిన చాలామంది అలాంటి కామెంట్స్ చేయడం ఎందుకు..? ఇప్పుడు క్షమాపణలు చెప్పి తమ గౌరవాన్ని కోల్పోవడం ఎందుకు? అన్నట్టు కామెంట్ చేస్తున్నారు.