Diljit Dosanjh : ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఓ కాంట్రవర్సీలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ కొరియోగ్రాఫర్ ఈ స్టార్ సింగర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తన తాజా మ్యూజికల్ టూర్ లో డ్యాన్సర్లకు డబ్బులు చెల్లిందలేదనే విషయాన్ని సదరు కొరియోగ్రాఫర్ వెలుగులోకి తీసుకొచ్చాడు.
డ్యాన్సర్లు ఫ్రీగా చేస్తారనుకున్నారా?
దిల్జిత్ దోసాంజ్ ప్రస్తుతం తన దిల్-లుమినాటి పర్యటనలో ఉత్తర అమెరికాలో ఉన్నారు. ఈ టూర్ వాంకోవర్ కెనడాలో ప్రారంభమై, జూలై 13న టొరంటోలో ముగిసింది. యూఎస్, కెనడాలో భారతీయ ప్రవాసులలో దిల్జిత్ కి పాపులారిటీ ఎంతగా ఉందంటే, అతను పర్ఫార్మెన్స్ ఇచ్చిన నగరాల్లో ఈవెంట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలోనే RRB డాన్స్ కంపెనీ యజమాని, కొరియోగ్రాఫర్ అయిన రజత్ రాకీ బట్టా దిల్జిత్ దోసాంజ్పై ఈ ఆరోపణ చేసారు. రాకీ లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్నాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ను పంచుకుంటూ తన పర్యటనకు వచ్చిన దేశీ డ్యాన్సర్లకు గాయకుడు దిల్జీత్ డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. రాకీ దేశీ డ్యాన్సర్లను అతను తక్కువ అంచనా వేయడంపై నిరాశను వ్యక్తం చేశాడు.
దిల్జీత్పై వచ్చిన ఆరోపణలేంటి?
దేశీ డ్యాన్స్ కమ్యూనిటీగా మేము దేశీ కళాకారుల గాజు సీలింగ్ను పగలగొట్టి ఉత్తర అమెరికా అంతటా పర్యటిస్తున్నామని రాకీ ఇన్స్టాగ్రామ్లో రాశారు. కానీ మన పరిశ్రమలో దేశీ డ్యాన్సర్లకు విలువ ఇవ్వకపోవడం చాలా నిరాశకు గురిచేస్తోంది. దిల్జిత్ దోసాంజ్ పర్యటనలో దేశీ డ్యాన్సర్లకు ఆయన డబ్బులు ఇవ్వలేదు. కళాకారులు ఉచితంగా పని చేయాలని భావిస్తున్నారు. దేశీ నృత్యం పరిశ్రమలోని కళాకారుల రక్తంలో ఉంది. అది మన పరిశ్రమలో ఒక భాగం. ఈ స్థాయి కళాకారుడు దేశీ డ్యాన్సర్ పరిశ్రమకు హాని కలిగించి, ఆ సంస్కృతిని కొనసాగించడం నిజంగా నిరాశపరిచింది అంటూ రాఖీ తన పోస్ట్ లఓ అసలు విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు దిల్జిత్ మీ విజయానికి మేము చాలా సంతోషిస్తున్నాము. కానీ మీ డ్యాన్సర్లకు కూడా మీరు డబ్బు చెల్లించాలి. అది కూడా ప్రొడక్షన్ బడ్జెట్లో భాగం కావాలి’ అంటూ డ్యాన్సర్లకు ఇవ్వాల్సిన డబ్బులు పే చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు.
బిజీ బిజీ కెరీర్
దిల్జిత్ కెరీర్ విషయానికొస్తే అతను చివరిసారిగా అమర్ సింగ్ చమ్కిలా చిత్రంలో కనిపించాడు. ఇందులో దిల్జిత్ నటనకు ప్రశంసలు దక్కాయి. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అతను వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న నో ఎంట్రీ 2 చిత్రంలో కనిపించనున్నాడు. తన సంగీతంతో సంగీత ప్రియులని ఉర్రూతలూగిస్తూ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన పంజాబీ గాన సంచలనం దిల్జిత్ దోసాంజ్ ప్రస్తుతం తన పర్యటనలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించడంలో బిజీగా ఉన్నారు. కాగా కల్కి మూవీలో కూడా ఈ సింగర్ భైరవ యాంతమ్ తో మెప్పించిన విషయం తెలిసిందే. దీంతో దిల్జీత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు కాగా, తాజాగా ఆయన తన టూర్ లో డ్యాన్సర్లకు డబ్బులు పే చేయలేదు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై దిల్జిత్ ఇంకా స్పందించలేదు.